KTR: ఇక నుంచి తెలంగాణ భవన్.. తెలంగాణ జనతా గ్యారేజ్: కేటీఆర్
ఎవరికి ఏ సమస్య ఉన్నా తెలంగాణ భవన్కు రావాలని ఆయన కోరారు.

KTR
హామీల అమలుపై నాలుగేళ్లు కాంగ్రెస్ కాంగ్రెస్పై పోరాడదామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్మిక విభాగం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ఎవరికి ఏ సమస్య ఉన్నా తెలంగాణ భవన్కు రావాలని ఆయన కోరారు. ఇక నుంచి తెలంగాణ భవన్.. తెలంగాణ జనతా గ్యారేజ్ అని చెప్పారు.
“అధికారం కోల్పోయినప్పటికీ పోరాటపటిమ పోలేదన్న రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ కార్మిక విభాగం పోరాడుతుంది. హమాలీల సమస్యలు ఏంటో తెలుసుకోకుండానే చాలామంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో పనిచేశారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మొదటి 15 రోజుల్లోనే హమాలీలను పిలుచుకొని మాట్లాడి వాళ్ల సమస్యలను పరిష్కరించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఎనిమిది రూపాయలు ఉన్న హమాలీ కూలీ ఆయ హయాంలోనే 26 రూపాయలకు చేరింది.
కరోనా కాలంలో కేసీఆర్ ప్రెస్ మీట్ కి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా టీవీల ముందు ఎదురు చూశారు. ఆయన చెప్పే మాట వినాలని చూశారు. ఆనాటి పాలకులు అంగన్వాడీ టీచర్లను గుర్రాలతో తొక్కిస్తే కేసీఆర్ అదే అంగన్వాడీ టీచర్లకు 4500 రూపాయలు ఉన్న జీతాన్ని 13,650 రూపాయలకి పెంచారు.
మినీ అంగన్వాడీ టీచర్లకు 2200 రూపాయలుగా ఉన్న జీతాన్ని 7800 రూపాయలు చేశారు. 2014లో ఆశా వర్కర్లకు 2500 రూపాయల జీతం ఉంటే దాన్ని 9750 రూపాయలకు పెంచారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కంటే అత్యధిక పే స్కేల్ తెలంగాణ ఉద్యోగులకు ఇస్తానని ఉద్యమ సమయంలోనే కేసీఆర్ చెప్పారు.
చెప్పిన మాట ప్రకారం 73% జీతాలను తెలంగాణ ఉద్యోగులకు పెంచారు. భారతదేశంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధికంగా జీతాలు ఇచ్చే రాష్ట్రం గా తెలంగాణను కేసీఆర్ నిలిపారు” అని కేటీఆర్ అన్నారు.
పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంపై డ్రోన్ ఎగిరిన ఘటనపై క్లారిటీ ఇచ్చిన అడిషనల్ ఎస్పీ