Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా 385 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 39వేల 386 కరోనా పరీక్షలు చేయగా 385 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 95 కొత్త కేసులు నమోదు.. మేడ్చ

Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా 385 కరోనా కేసులు

Telangana Corona Cases

Updated On : February 21, 2022 / 9:14 PM IST

Telangana Corona Cases : తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 39వేల  386 కరోనా పరీక్షలు చేయగా 385 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 95 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 31, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27, ఖమ్మం జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి.

Telangana : కరోనా వ్యాక్సినేషన్..దేశంలోనే తెలంగాణ టాప్

అదే సమయంలో గడిచిన 24గంటల్లో 733 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,87,063 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,78,167 మంది ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో 4వేల 787 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, క్రితం రోజు 256 కరోనా కేసులు నమోదవగా, నేడు ఆ సంఖ్య పెరిగింది.

Corona Virus: కరోనా ముగిసింది.. ఐటీ ఉద్యోగులకూ “వర్క్ ఫ్రమ్ హోమ్” అవసరం లేదు

భారత్ ను భయాందోళనకు గురి చేసిన కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. దాంతో కొత్త కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. వరుసగా రెండోరోజు 20వేల దిగువనే నమోదయ్యాయి. తాజాగా మరణాల సంఖ్యా భారీగా తగ్గింది.

ఆదివారం 8 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 16వేల 051 మందికి పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వైరస్ పాజిటివిటీ రేటు 1.93 శాతంగా ఉంది. 24 గంటల వ్యవధిలో మరో 206 మంది కోవిడ్ తో చనిపోయారు. ముందురోజు ఆ సంఖ్య 673గా ఉంది. 2020 జనవరి నుంచి 4.28 కోట్ల మందికి కరోనా సోకగా.. 5,12,109 మంది మరణించారు.

కొవిడ్ వ్యాప్తి కట్టడిలో ఉండటంతో యాక్టివ్ కేసులు 2 లక్షలకు దిగొచ్చాయి. రికవరీ రేటు 98.33 శాతం కాగా.. మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. ఇక నిన్న 37,901 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.21 కోట్లు దాటింది. నిన్న 7 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకూ 175 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం కరోనా లెక్కలు విడుదల చేసింది.