Telangana Corona Cases : తెలంగాణకు బిగ్ రిలీఫ్.. తగ్గిన కరోనా కేసులు, సున్నా మరణాలు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 683 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో ఎలాంటి కరోనా మరణాలు సంభవించ లేదు. కరోనా బారి నుంచి..

Telangana Corona Cases : తెలంగాణకు బిగ్ రిలీఫ్.. తగ్గిన కరోనా కేసులు, సున్నా మరణాలు

Telangana Corona Cases

Updated On : February 12, 2022 / 9:18 PM IST

Telangana Corona Cases : తెలంగాణకు బిగ్ రిలీఫ్. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. మరోవైపు ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 52వేల 714 కరోనా టెస్టులు చేయగా, కొత్తగా 683 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,83,019కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో ఎలాంటి కరోనా మరణాలు సంభవించ లేదు. కరోనా బారి నుంచి నిన్న 2వేల 645 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,674 కోవిడ్ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ 168 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

ఏపీలోనూ కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 896 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో ఆరుగురు కోవిడ్ తో మరణించారు. ఒక్కరోజులో 8వేల 849 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24వేల 454 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 24గంటల వ్యవధిలో 24,066 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు. శుక్రవారంతో (1,166) పోలిస్తే శనివారం కరోనా కేసుల సంఖ్య మరింత తగ్గింది.

Android 12 Feature : ఈ స్మార్ట్ ఫోన్లలోకి కూల్ ఆండ్రాయిడ్ 12 ఫీచర్ వస్తోంది.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..!

అటు దేశవ్యాప్తంగానూ కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. తాజాగా కొత్త కేసులు 50 వేలకు దిగొచ్చాయి. శుక్రవారం 14 లక్షల మందికి కరోనా టెస్తులు చేయగా.. 50వేల 407 మందికి పాజిటివ్ గా నిర్ధరణ అయ్యింది. ముందురోజు కంటే కేసులు 13 శాతం మేర తగ్గాయి. దాంతో పాజిటివిటీ రేటు 3.48 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

కరోనా వ్యాప్తి అదుపులో ఉండటంతో యాక్టివ్ కేసులు 6 లక్షల (1.43 శాతం)కు పడిపోయాయి. నిన్న ఒక్కరోజే 1,36,962 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఈ రెండేళ్ల వ్యవధిలో 4.25 కోట్ల మందికి కరోనా సోకగా.. 4.14 కోట్ల మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. రికవరీ రేటు 97.37 శాతానికి పెరిగింది.

Sleep : అతిగా నిద్రపోతున్నారా!…అయితే జాగ్రత్త?

24 గంటల వ్యవధిలో 804 మంది కరోనాతో ప్రాణాలు వదిలారు. క్రితం రోజుతో పోలిస్తే మరణాల సంఖ్య (657) పెరిగింది. దేశంలో ఇప్పటివరకు కోవిడ్ తో చనిపోయిన వారి సంఖ్య 5,07,981 పెరిగింది. ఇక నిన్న 46 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటివరకు 172 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.