Ministry of Health: పురుషులకంటే మహిళల జీవిత కాలం ఎక్కువ.. ఆ నివేదికలో ఆసక్తికర విషయాలు..

దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజల జీవితకాలం పెరుగుతోంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుండటంతో పాటు, మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తుండటంతో మానవుల జీవితకాలం పెరుగుతుంది. ముఖ్యంగా ప్రజల్లో...

Ministry of Health: పురుషులకంటే మహిళల జీవిత కాలం ఎక్కువ.. ఆ నివేదికలో ఆసక్తికర విషయాలు..

Woman And Man

Ministry of Health: దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజల జీవితకాలం పెరుగుతోంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుండటంతో పాటు, మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తుండటంతో మానవుల జీవితకాలం పెరుగుతుంది. ముఖ్యంగా ప్రజల్లో అనారోగ్యంబారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెరుగుతోంది. పలు సంస్థలు, సామాజిక మాధ్యమాలు తదితర వాటిల్లో నిత్యం మెరుగైన ఆరోగ్యంకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు సూచనలు చేస్తుండటంతో ప్రజలుసైతం అప్రమత్తమవుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో జాతీయ జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సర్వేను నిర్వహించి నివేదికను రూపొందించింది.

Women Health : మహిళలు ఉద్యోగంతోపాటు ఆరోగ్యం విషయంలోనూ!

ఈ నివేదిక ప్రకారం.. దేశంలో పురుషుల కంటే స్త్రీల ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుందని నివేదికలో తెలిపింది. అయితే దేశం మొత్తం మీద కేరళ రాష్ట్రంలోనే పురుషులు, స్త్రీల ఆయుష్షు అత్యధికంగా ఉంటుందని అంచనా వేసింది. కేరళలో మహిళల ఆయుర్దాయం 2031-35 మధ్య 80.2 సంవత్సరాలు, పురుషుల జీవితకాలం 74.5 సంవత్సరాలుగా ఉంటుందని జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తన నివేదికలో అంచనా వేసింది. మరోవైపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పురుషుల, స్త్రీల జీవితం కాలం తక్కువ అని నివేదికలో అంచనా వేసింది. ఈ రాష్ట్రంలో 2031-35 మధ్య పురుషులు జీవితం కాలం 69.4 సంవత్సరాలు, మహిళల ఆయుర్దాయం 71.8 సంవత్సరాలు ఉంటుందని అంచనా. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2021 నుంచి 2025 వరకు పురుషుల జీవితం కాలం 69.06 కాగా, స్త్రీల జీవిత కాలం 73.6గా నివేదిక అంచనా వేసింది. ఇక 2026-30 మధ్య కాలంలో పురుషుల ఆయుర్దాయం 70.6 కాగా స్త్రీల ఆయుర్దాయం 74.6గా జాతీయ జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక పేర్కొంది.

Healthy Food : పిల్లల ఎదుగుదలలో పోషకాహారమే కీలకం!

2031-2035 మధ్య కాలంలో పురుషుల జీవితకాలం 71.4, స్త్రీల ఆయుర్ధాయం 75.6గా అంచనా. ఈ నివేదిక ప్రకారం ఏపీలో రానురాను మనుషుల ఆయుష్సు పెరుగుతుండగా, అందులో స్త్రీల జీవితకాలం పురుషుల కంటే నాలుగేళ్లు ఎక్కువగా ఉంటుందని అంచనా. జాతీయ జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక మరో విషయాన్ని పేర్కొంది. దేశంలో సంతానోత్పత్తి క్షీణించడంతో పాటు మనుష్సుల ఆయుష్సు పెరుగుతుండటంతో వృద్ధుల శాతం పెరుగుతుందని నివేదిక తెలిపింది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశంలో మొత్తం జనాభాలో వృద్ధుల వాటా 8.4శాతం ఉండగా, 2031-35 మధ్య వృద్ధుల సంఖ్య రెండింతలు పెరిగి 14.9శాతానికి చేరుతుందని జాతీయ జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక అంచనా వేసింది.