RRR: ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్కు గెస్టులు వారే..?
టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తనదైన మార్క్తో తెరకెక్కించగా...
RRR: టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తనదైన మార్క్తో తెరకెక్కించగా, ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటం విశేషం. మెగా పవర్స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు మేటి నటులను ఈ సినిమాలో తీసుకోవడంతో RRRపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా రిలీజ్ను పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన జక్కన్న అండ్ టీమ్, ఇప్పుడు ఫైనల్గా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కు రెడీ చేసింది. ఈ సినిమాతో మరోసారి ఇండయిన్ బాక్సాఫీస్ వద్ద జక్కన్న అండ్ టీమ్ వండర్స్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.
RRR: జక్కన్న భారీ ప్రమోషన్స్ స్కెచ్.. ఫ్యాన్స్కు పండగే!
కాగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ-రిలీజ్ ఈవెంట్ను మార్చి 19న నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్లో RRR గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ను నిర్వహిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే తాజాగా ఈ ఈవెంట్కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ భారీ ప్రీరిలీజ్ ఈవెంట్కు ఇద్దరు తెలుగు స్టార్ హీరోలు ముఖ్య అతిథులుగా రానున్నారట. ఇంతకీ ఈ ఇద్దరు హీరోలు ఎవరా అని అందరూ అనుకుంటుండగా.. వారు మరెవరో కాదట.. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ అని తెలుస్తోంది.
RRRలో తారక్, చరణ్లకు సపోర్ట్గా వీరిద్దరిని గెస్టులుగా తీసుకురానుందట చిత్ర యూనిట్. అయితే చాలా ఫన్నీగా సాగే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్లో చిరంజీవి తారక్కు సపోర్ట్ ఇవ్వనుండగా, బాలయ్య చరణ్కు వత్తాసు పలుకుతాడట. ఈ వార్తతో అటు మెగా అభిమానులతో పాటు నందమూరి అభిమానుల్లో ఈ ప్రీరిలీజ్ ఈవెంట్పై హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు చిత్ర యూనిట్. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
RRR: సజ్జనార్ వాడకం మామూలుగా లేదుగా!
ఇక తారక్ భీమ్గా, చరణ్ రామరాజుగా నటిస్తున్న RRRలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. హీరోయిన్లుగా ఆలియా భట్, ఒలివియా మారిస్ చేస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. డివివి దానయ్య నిర్మాణంలో రానున్న ఈ సినిమా కోసం ఓవర్సీస్ ఆడియెన్స్ అప్పుడే భారీ స్థాయిలో టికెట్స్ బుక్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్కు చిరు-బాలయ్య నిజంగానే వస్తారా అనేది చూడాలి.