Virupaksha : విరూపాక్ష సినిమాకి వాళ్ళు నో ఎంట్రీ..

సాయి ధరమ్ తేజ్, సంయుక్త కలిసి నటించిన మిస్టికల్ థ్రిల్లర్ చిత్రం విరూపాక్ష ఏప్రిల్ 21న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాని వాళ్ళు చూడడానికి నో ఎంట్రీ..

Virupaksha : విరూపాక్ష సినిమాకి వాళ్ళు నో ఎంట్రీ..

Sai Dharam Tej Samyuktha Menon Virupaksha got A certificate

Virupaksha : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఆక్సిడెంట్ నుంచి కోలుకున్న తరువాత నటిస్తున్న చిత్రం ‘విరూపాక్ష’. మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథని అందిస్తున్నాడు. కొత్త దర్శకుడు కార్తీక్ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వరుస విజయాలతో గోల్డెన్ లెగ్ అనిపించుకుంటున్న సంయుక్త (Samyuktha Menon) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఏప్రిల్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ చిత్రంతో సాయి ధరమ్ తేజ్ కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు.

Sai Dharam Tej : కెరీర్ మొదటిలో నన్ను గైడ్ చేసింది ఎన్టీఆర్.. సాయి ధరమ్ తేజ్

రిలీజ్ దగ్గర పడడంతో మూవీ టీం ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో ఈ సినిమాకి 18 ఏళ్ళ లోపు ఉన్నవారికి నో ఎంట్రీ. ఇటీవల రిలీజ్ అయిన రవితేజ రావణాసుర సినిమాకి కూడా A సర్టిఫికెట్ రావడంతో కొన్ని చోట్ల ఆధార కార్డులు చెక్ చేసి మరి థియేటర్ లోకి అనుమతించారు థియేటర్ యాజమాన్యం. విరూపాక్షకి కూడా A సర్టిఫికెట్ రావడంతో మూవీ పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

పల్లెటూరుల్లో జరిగే చేతబడి కథాంశంతో ఈ సినిమా కథ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎంతలా బయపెడుతుందో చూడాలి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రొడక్షన్స్ లో బివిఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తుండగా సునీల్, రాజీవ్ కనకాల, జాన్సీ, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.