VIP Tree :ఈ చెట్టు నుంచి ఒక్క ఆకు రాలినా అధికారుల కంటిమీద కునుకు ఉండదు..!!

అదొక చెట్టు. ఆ చెట్టుకు 24 గంటలు పోలీసులు కాపలాకాస్తుంటారు. ఈ చెట్టునుంచి ఒక్క ఆకు రాలినా అధికారులకు కంటిమీద కునుకు ఉండదు. ఆఘమేఘాల మీద ఈ చెట్టు వద్ద రెక్కలు కట్టుకుని వాలిపోతారు.

VIP Tree :ఈ చెట్టు నుంచి ఒక్క ఆకు రాలినా అధికారుల కంటిమీద కునుకు ఉండదు..!!

Vip Tree In Madhyapradesh

Bodhi tree in madhya pradesh has 24 hour full security : అదొక చెట్టు. ఆ చెట్టుకు 24 గంటలు పోలీసులు కాపలాకాస్తుంటారు. కంటిమీద కునుకు తీయకుండా కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ కాపలా కాస్తుంటారు. అంతేకాదు ఈ చెట్టునుంచి ఒక్క ఆకు రాలినా అధికారుల కంటిమీద కునుకు ఉండదు.ఆఘమేఘాల మీద ఆ చెట్టు వద్దకు పరుగులు పెట్టుకుంటు వచ్చి దానికేమైందో పరిశీలిస్తారు. ఈ చెట్టును ప్రతీ 15 రోజులకు ఒకసారి వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీ చేసి.. దాని ఆరోగ్య పరిస్థితి గురించి సమీక్ష చేస్తారు. ఇలా ఈ చెట్టు కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతోంది ప్రభుత్వం. ఇంతకీ ఏంటా చెట్టు? ఎందుకంత సెక్యూరిటీ? ఎందకంత ఆ చెట్టును అపురూపంగా చూస్తున్నారు? ఇంత వీవీఐపీగా చూసుకునే ఈ చెట్టు ఎక్కడుందో తెలుసుకుందాం.

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్ సమీపంలోనే ని రైసెన్ జిల్లా. భోపాల్ దగ్గర్లోని సాంచి, సలామత్ పుర మధ్య ఉన్న చిన్న గుట్ట మీద ఈ వీవీఐపీ చెట్టు ఉంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ చెట్టు ‘బోది చెట్టు’. బోధి వృక్షం అంటే మనకు ఠక్కున ఎవరు గుర్తుకొస్తారు? హా ..ఆయనే గౌతమ బుద్ధుడు. బౌద్ధ విశ్వవిద్యాలయం నిర్మితమైన సలామత్ కొండపైన ఈ బోధి చెట్టును నాటారు. అదేనండి రావి చెట్టు. గౌతముడికి రావి చెట్టు కిందే జ్ఞానోదయం అయ్యి బుద్ధుడయ్యాడు.అందుకే బౌద్ధులు రావిచెట్టుకుని బోధి చెట్టు అంటారు. ఈ బోధి చెట్టు నాటినప్పుడు మొక్కే. అది ఇప్పుడు 15 అడుగుల వరకూ పెరిగి చెట్టు అయ్యింది. ఈ చెట్టును రక్షించటానికి సెక్యూరిటీగా ఐదుగురు పోలీసులు నిరంతరం కాపాలా కాస్తుంటారు. ఇక ఈ చెట్టును ప్రతీ 15 రోజులకు ఒకసారి వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీ చేసి.. దాని ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తారు.

Read more : Oldest Grape Tree: ప్రపంచంలోనే అత్యంత పురాతనన ద్రాక్ష పాదు..ఇప్పటికీ దీని పండ్లతో తయారైన వైన్ కు ఫుల్ డిమాండ్

ఎందుకంత ప్రాధాన్యత?
ఈ బోధి వృక్షాన్ని సెప్టెంబర్ 21, 2012 సంవత్సరంలో అప్పుడు శ్రీలంక అధ్యక్షుడుగా ఉన్న మహింద రాజపక్స నాటారు. రావిచెట్టుకు బౌద్ధమతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉందనే విషయం తెలిసిందే. బౌద్ధ మత గ్రంథాల ప్రకారం.. బుద్దుడు బోధ్ గయలోని బోధి చెట్టు కిందే జ్ఞానోదయం పొందాడు. అశోక చక్రవర్తి కూడా బోధి చెట్టు కిందే ఆశ్రయం పొందాడు. అందుకే ఈ బోధి చెట్టుకు పటిష్టమైన భధ్రత ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నారు. 15 అడుగుల ఎత్తులో ఉన్న ఈ చెట్టు చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు.దీనికి రక్షణగా ఎప్పుడూ ఐదుగురు సెక్యూరిటీ గార్డులు కాపలాగా ఉంటారు. ఈ చెట్టు నిర్వహణ కోసం ప్రతీ సంవత్సరం 12 నుంచి 15 లక్షల రూపాయల మేర ఖర్చు అవుతుందట. కాగా, ఈ చెట్టును చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున అక్కడికి వస్తారట. ప్రస్తుతం కరోనా కావడంతో.. పర్యాటకుల సంఖ్య తగ్గిందని అధికారులు చెబుతున్నారు.

ఈ చెట్టు దరిదాపుల్లోకి ఎవరినీ రానివ్వరు. వారు వీఐపీ, వీవీఐపీ అయినా సరే ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందే. వారు వీఐపీ, వీవీఐపీ అయినా సరే ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందే. అంతేకాదు.. ఒక్క ఆకు రాలినా ఆ రోజు అధికారులకు కంటిమీద నిద్ర కరువేనే చెప్పాలి. ఆఘమేఘాల మీద చెట్టు దగ్గర రెక్కలు కట్టుకుని వాలిపోతారు. దానికేమైందోనని పరిశీలిస్తారు.ఈ బోది చెట్టుకు సాంచి నగర పాలికే నుంచి ప్రత్యేకమైన ట్యాంకులో నీటినే ఉపయోగిస్తారు. సకాలంలో నీరు పొయ్యారు. అవసరానికి తగినట్లుగా వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు ఎరువు వేయాలి. ఈ బోధి చెట్టు సంరక్షణ కోసం ఒక్కోసారి శ్రీలంక నుంచి నిపుణులను రప్పిస్తుంటారు.

Read more : General Sherman tree : 2,300 ఏళ్ల వయస్సున్న భారీ వృక్షానికి అల్యూమినియం కవర్

బుద్ధుడు పెట్టిన చెట్టు కొమ్మ.. భారత్ నుంచి శ్రీలంకకు
బుద్ధునికి జ్జానోదయం అయిన బోధి చెట్టు నుంచి చిన్న కొమ్మను క్రీస్తు పూర్వం 3వ శతబ్దంలో భారత్ నుంచి శ్రీలంకకు తీసుకువెళ్లారు. అక్కడ అనురాధాపురంలో ఆ కొమ్మను నాటి సంరక్షించారు. అప్పటి నుంచి అనురాధాపురం అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో భారత దేశం నుంచి అక్కడికి పర్యాటకులు వెళతుంటారు. ఆ చెట్టును శ్రీలంకవారు పరమ పవిత్రమైన చెట్టుగా భావిస్తారు.

ఇక ప్రస్తుతం ఆ చెట్టు నుంచి ఓ కొమ్మను తిరిగి భారత దేశానికి తీసుకువచ్చారు. చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బౌద్ధ విశ్వవిద్యాలయం కలిగిన సాంచిలోని సలామత్‌పూర్‌ కొండపై ఈ బోధికొమ్మను నాటారు. అదిప్పుడు వృక్షంగా మారింది. దీనిని సెప్టెంబర్ 21 సెప్టెంబర్ 2012లో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్స నాటారు.అది ఇప్పుడు 15 అడుగులు పెరిగింది. ఇది బౌద్ధమతంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన చెట్టు కాబట్టి దీనికి ప్రత్యేకంగా రక్షణ చర్యలు చేపడుతున్నారు. బౌద్ధ మత గ్రంథాల ప్రకారం.. బుద్దుడు బోధ్ గయలోని బోధి చెట్టు కిందే జ్ఞానోదయం పొందాడు. అశోక చక్రవర్తి కూడా బోధి చెట్టు కిందే ఆశ్రయం పొందాడు. అందుకే ఈ బోధి చెట్టును అంత్యంత పటిష్ట భద్రత నడుమ సంరక్షిస్తున్నారు.

Read more : విచిత్రం : చెట్టును నరికితే నీళ్లొస్తున్నాయి

15 అడుగుల ఎత్తులో ఉన్న చెట్టు చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. దీనికి రక్షణగా ఎప్పుడూ ఐదుగురు సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ఈ చెట్టు నిర్వహణ కోసం ప్రతీ సంవత్సరం 12 నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈ వీవీఐపీ చెట్టును చూడటానికి పర్యాటకులు వస్తుంటారు.