Swine flu: స్వైన్ ఫ్లూ కలకలం.. పెరుగుతున్న కేసులు.. ఝార్ఖండ్‌లో నలుగురికి పాజిటివ్

దేశంలో కరోనా కేసులు తగ్గుతుంటే స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. రెండింటిలోనూ కొన్ని లక్షణాలు ఒకేలా ఉండటంతో చాలా మంది స్వైన్ ఫ్లూ సోకినా.. కోవిడ్ పరీక్షలు మాత్రమే చేసుకుంటున్నారు. దీంతో ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది.

Swine flu: స్వైన్ ఫ్లూ కలకలం.. పెరుగుతున్న కేసులు.. ఝార్ఖండ్‌లో నలుగురికి పాజిటివ్

Swine flu: దేశంలో ఒకవైపు కరోనా, మంకీపాక్స్ కేసులు తగ్గుముఖం పడుతుంటే మరోవైపు స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్) కేసులు కలవరపెడుతున్నాయి. తాజాగా ఝార్ఖండ్‌లో నలుగురికి స్వైన్ ఫ్లూ సోకింది. రాష్ట్ర రాజధాని రాంచీలోని ఒక ఆస్పత్రిలో నలుగురికి స్వైన్ ఫ్లూ సోకినట్లు అధికారులు వెల్లడించారు. బాధితులకు స్థానిక భగవాన్‌ మహావీర్‌ మెడికల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Elon Musk: కొడుకు ప్రపంచ కుబేరుడు.. సరైన ఇల్లు లేక గ్యారేజ్‌లో నిద్రించిన తల్లి

ఈ నలుగురితోపాటు ఇంకో ఇద్దరికి కూడా స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయని, వారికి సంబంధించిన ఫలితాలు సోమవారం వస్తాయని ఆసుపత్రి అధికారులు తెలిపారు. సాధారణంగా స్వైన్ ఫ్లూలో జ్వరం, చలి, దగ్గు, గొంతులో మంట, ముక్కు కారడం, కళ్లు ఎర్రబారడం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, అలసట, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. వీటిలో చాలా వరకు లక్షణాలు కోవిడ్‌లో ఉంటాయి. దీంతో బాధితులు ఎక్కువగా ఈ లక్షణాలుంటే కోవిడ్ టెస్టులు చేయించుకుంటున్నారు. ఈ పరీక్షల్లో వారికి కోవిడ్ నెగెటివ్ వస్తోంది. అయితే, ఈ లక్షణాలుంటే కోవిడ్‌తోపాటు స్వైన్ ఫ్లూ పరీక్షలు కూడా చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శ్వాసకోస సమస్యలు ఎక్కువగా ఉంటే, వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

CM KCR: తెలంగాణ సాధన కోసం అనుసరించిన పంథాలోనే రైతు ఉద్యమం: సీఎం కేసీఆర్

లేదంటే మాములు ఫీవర్‌గానే భావించాలని చెబుతున్నారు. రోగులు కోవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉండి, నెగెటివ్ వస్తే స్వైన్ ఫ్లూ పరీక్షలు చేయించుకోవడం వల్ల ఈ వ్యాధి మరింత మందికి సోకకుండా కూడా చూసుకోవచ్చు. ఇక, హైదరాబాద్‌లో కూడా స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు సమాచారం. ప్రతి వారం 15 వరకు స్వైన్ ఫ్లూ కేసులు వస్తున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.