Hyderabad: పీర్జాదిగూడ పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 13 మంది అరెస్ట్

మేడిపల్లి పరిధిలోని, పీర్జాదిగూడ కార్పొరేషన్‌లోని సాయి ప్రియ సర్కిల్ వద్ద కో ఆప్షన్ మెంబర్ జగదీశ్వర్ రెడ్డి ఆఫీసులో పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఇక్కడ నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఎస్‌వోటీ పోలీసులు దాడి చేయడంతో 13 మంది పట్టుబడ్డారు. వీరిలో ఏడుగురు కార్పొరేటర్లు, ఆరుగురు బిల్డర్లు ఉన్నారు.

Hyderabad: పీర్జాదిగూడ పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 13 మంది అరెస్ట్

Hyderabad: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్ జిల్లాలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు జరిపిన దాడుల్లో 13 మంది పట్టుబడ్డారు. వీరిలో ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నట్లు సమాచారం. మేడిపల్లి పరిధిలోని, పీర్జాదిగూడ కార్పొరేషన్‌లోని సాయి ప్రియ సర్కిల్ వద్ద కో ఆప్షన్ మెంబర్ జగదీశ్వర్ రెడ్డి ఆఫీసులో పోలీసులు ఆకస్మిక దాడి చేశారు.

Budget Session: రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్న ప్రభుత్వం

ఇక్కడ నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఎస్‌వోటీ పోలీసులు దాడి చేయడంతో 13 మంది పట్టుబడ్డారు. వీరిలో ఏడుగురు కార్పొరేటర్లు, ఆరుగురు బిల్డర్లు ఉన్నారు. పట్టుబడ్డ వారిలో ఎక్కువ మంది బీఆర్ఎస్ నేతలే అని తెలుస్తోంది. ఇక్కడ పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు కొంతకాలంగా సమాచారం ఉంది. దీంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. పేకాట శిబిరం నుంచి భారీ ఎత్తున నగదు, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ లక్షల్లో డబ్బు పెట్టి పేకాట ఆడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో పట్టుబడ్డ వారిపై గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

CM Jagan: నేడు జగనన్న చేదోడు నిధుల విడుదల.. పల్నాడులో విడుదల చేయనున్న సీఎం జగన్

నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తర్వాత నోటీసులిచ్చి వదిలేసినట్లు సమాచారం. కాగా, ఈ దాడుల్లో తాను పట్టుబడ్డట్లు జరుగుతున్న ప్రచారంపై డిప్యూటీ మేయర్ శివ కుమార్ స్పందించారు. పేకాటతో తనకేం సంబంధం లేదని, కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తన ఎదుగుదల చూసి ఓర్వలేకే కుట్రలు పన్నినట్లు చెప్పారు. కో ఆప్షన్ మెంబర్ జగదీశ్వర్ రెడ్డి ఆఫీసులో దాడులు జరిగాయని, ఆ ఆఫీస్ పక్కనే తన కార్యాలయం ఉండటంతో తప్పుడు ప్రచారం జరిగిందని ఆయన అన్నారు.