ఏపీలో కొత్తగా 7,895 కరోనా కేసులు, 93 మంది మృతి

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 7,895 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయ. 24 గంటల్లో కరోనా వల్ల 93 మంది మృతి చెందారు.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 46,712 శాంపిల్స్ ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 32,38,038 శాంపిల్స్ ను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో 7,449 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఏపీలో ఇప్పటివరకు 3,282 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం 3,53,111 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 89,742 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 2,60,087 మంది కోలుకుని, డిశ్చార్జ్ అయ్యారు.
గత 24 గంటల్లో అనంతపురం 466, చిత్తూరు 934, తూర్పుగోదావరి 1256, గుంటూరు 507, కడప 448, కృష్ణా 142, కర్నూలు 685, నెల్లూరు 985, ప్రకాశం 923, శ్రీకాకుళం 227, విశాఖపట్నం 451, విజయనగరం 200, పశ్చిమ గోదావరి 671 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
కరోనా వల్ల నెల్లూరు 16, పశ్చిమ గోదావరి 13, చిత్తూరు 11, కర్నూలు 10, ప్రకాశం 9, కడప 8, శ్రీకాకుళం 6, విశాఖపట్నం 5, తూర్పు గోదావరి 4, అనంతపురం 3, గుంటూరు 3, కృష్ణా 3, విజయనగరం 2 చొప్పున మృతి చెందారు.