ఏపీలో కొత్తగా 9,996 కరోనా కేసులు, 82 మంది మృతి

ఏపీలో కొత్తగా 9,996 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 82 మంది మృతి చెందారుు. 55,692 శాంపిల్స్ ను పరీక్షించగా 9996 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గడచిన 24 గంటల్లో 9499 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 27,05, 459 శాంపిల్స్ ను పరీక్షించారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 2,64,142 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 90840 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,70,924 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2378 మంది కరోనాతో మరణించారు.
గడిచిన 24 గంటల్లో అనంతపురం 856, చిత్తూరు 963, తూర్పు గోదావరి 1504, గుంటూరు 595, కడప 784, కృష్ణా 330, కర్నూలు 823, నెల్లూరు 682, ప్రకాశం 681, శ్రీకాకుళం 425, విశాఖపట్నం 931, విజయనగరం 569, పశ్చిమ గోదావరి 853 కేసులు నమోదు అయ్యాయి.
గత 24 గంటల్లో కరోనా వల్ల వల్ల తూర్పుగోదావరి 10, గుంటూరు 10, అనంతపురం 8, కడప 7, చిత్తూరు 6, కర్నూలు 6, నెల్లూరు 6, ప్రకాశం 6, శ్రీకాకుళం 6, విశాఖపట్నం 6, విజయనగరం 5, పశ్చిమ గోదావరి 5, కృష్ణా 1 చొప్పున మరణించారు.