YS Sharmila: తెలంగాణ ప్రజలు ఛీ కొడితే ఆంధ్రప్రదేశ్‌లోకి షర్మిల వచ్చి..: మంత్రి రోజా

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి సంక్రాంతికి వచ్చే డుడూ బసవన్నలా వచ్చారంటూ మంత్రి రోజా ఎద్దేవా చేశారు.

YS Sharmila: తెలంగాణ ప్రజలు ఛీ కొడితే ఆంధ్రప్రదేశ్‌లోకి షర్మిల వచ్చి..: మంత్రి రోజా

Minister Roja

Updated On : January 26, 2024 / 8:36 PM IST

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి సంక్రాంతికి వచ్చే డుడూ బసవన్నలా వచ్చారంటూ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. వైఎస్సార్ అభిమానులంతా జగన్ వెంటే ఉన్నారు ఉంటారని తెలిపారు.

విజయవాడ బాపు మ్యూజియంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో లేజర్, సౌండ్ లైట్ షోను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలు ఛీ కొడితే షర్మిల ఏపీలోకి వచ్చారని చెప్పారు. సీఎం జగన్ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. జగన్ పాలనపై ఏపీ ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధి రాష్ట్రంలో కనిపిస్తుందని అన్నారు.

విజయవాడలో అంబేద్కర్ భారీ విగ్రహాన్ని పెట్టామని, బాపూ మ్యూజియం, భవాని ఐలాండ్ వంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. వచ్చే ఏపీ ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించాక షర్మిల.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్ పై ఇప్పటికే పలుసార్లు విరుచుకుపడ్డారు.

లోక్‌సభ ఎన్నికలకు కేసీఆర్ సరికొత్త వ్యూహం.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీళ్లేనా?