Puneeth Rajkumar: ఇక సెలవు..! ప్రభుత్వ లాంఛనాలతో పూర్తైన పునీత్ అంత్యక్రియలు

కంఠీరవ స్టేడియంలో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు అభిమానుల కన్నీటి మధ్య ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా జరిగింది.

Puneeth Rajkumar: ఇక సెలవు..! ప్రభుత్వ లాంఛనాలతో పూర్తైన పునీత్ అంత్యక్రియలు

Punith

Updated On : October 31, 2021 / 8:24 AM IST

Puneeth Rajkumar: కంఠీరవ స్టేడియంలో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు అభిమానుల కన్నీటి మధ్య ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా జరిగింది. వేల మంది అభిమానుల మధ్య రాజ్ కుమార్ స్టూడియోలో సంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. గౌరవ సూచకంగా మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు.

‘వీర కన్నడిగ’ పునీత్ పార్థవదేహం వద్ద ముఖ్యమంత్రి బొమ్మై, రాజ్‌కుమార్ కుటుంబంతో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉన్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా పునీత్ భార్యకు గౌరవంగా జాతీయపతాకం అందించింది ప్రభుత్వం.

నటుడు రవిచంద్రన్, సుదీప్, యష్, నటుడు రిషబ్ శెట్టి, టెన్నిస్ కృష్ణ, నటి, శ్రీజన్ లోకేష్, ఎంపీ సుమలత, యోగితో పాటు పలువురు ఉన్నారు. మాజీ సీఎం బీఎస్‌వై, సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో పాటు పలువురు హాజరయ్యారు. పునీత్ అంత్యక్రియలకు ముందు మూడు దఫాలు నివాళులర్పించారు.