Sachin Pilot : ఎడారి రాష్ట్రంలో పొలిటికల్ హీట్..బీజేపీలోకి సచిన్ పైలట్?
కాంగ్రెస్ నాయకుడు,రాజస్తాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ బీజేపీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Sachin Pilot కాంగ్రెస్ నాయకుడు,రాజస్తాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ బీజేపీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు మరియు రాజస్తాన్ బీజేపీ చీఫ్ ఏపీ అబ్ధుల్లాకుట్టి ఆదివారం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎడారి రాష్ట్రంలో మరింత హీట్ పెంచుతున్నాయి.
ఉన్నపళంగా సచిన్ పైలట్ పై రాజస్తాన్ బీజేపీ ప్రశంసల వర్షం కురిపించారు. సచిన్ పైలట్ మంచి నాయకుడని,భవిష్యత్ లో ఆయన బీజేపీలో చేరే అవకాశముందని అబ్ధుల్లాకుట్టి వ్యాఖ్యానించారు. దీంతో పైలట్ కాషాయ తీర్దం పుచ్చుకుంటారని మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాగా,గతేడాది సీఎం అశోక్ గెహ్లోత్ ప్రభుత్వంపై సచిన్ పైలట్ సహా ఆయన వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సమయంలోనూ పైలట్ బీజేపీలో చేరతారనే ప్రచారం సాగిన విషయం తెలిసిందే. ఓ దశలో పైలట్ బీజేపీ హైకమాండ్ తో చర్చలు జరిపినట్లు కూడా వార్తలు వినిపించాయి.
అయితే,కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగి పైలట్ ని బుజ్జగించడంతో.. పైలట్ బీజేపీ చేరికకు బ్రేక్ పడింది. బీజేపీలో తాను చేరడం లేదని,తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని అప్పట్లో పైలట్ ప్రకటించారు. అయితే త్వరలోనే రాజస్తాన్ లో మంత్రివర్గ విస్తరణ ఉందన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో..తన వర్గంలోని కొంతమందిని కేబినెట్ లోకి తీసుకోని పక్షంలో సచిన్ పైలట్ కాషాయకండువా కప్పుకుంటారనే ప్రచారం ఇప్పుడు జోరుగా జరుగుతోంది.
READ :Gehlot vs Pilot : రాజస్తాన్ పై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్