కేసీఆరే ఈ చట్టానికి, పుస్తకానికి రచయిత: రేవంత్ రెడ్డి ఆగ్రహం
మాజీ సీఎం కేసీఆర్ సూచనలతోనే అప్పట్లో విభజన చట్టం రూపొందించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Revanth Reddy
మాజీ సీఎం కేసీఆర్ సూచనలతోనే అప్పట్లో విభజన చట్టం రూపొందించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆరే ఈ చట్టానికి, పుస్తకానికి రచయిత అని చెప్పారు. ప్రజలను గందరగోళానికి గురి చేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని అన్నారు.
కృష్ణా జలాల వివాదంపై రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. బీఆర్ఎస్ పాపాలను కాంగ్రెస్ పై నెట్టేసే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. విభజన చట్టంలోని ప్రతి అక్షరాన్ని తనను అడిగే రాశారని గతంలో కేసీఆర్ చెప్పారని అన్నారు.
రేవంత్ రెడ్డి కామెంట్స్
- కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే ఇవన్నీ జరిగాయి
- విభజన చట్టం రావడానికి కారణం కేసీఆరే
- సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్ నేను చూపిస్తున్నాను
- ఇప్పుడు విభజన చట్టం వల్ల రాష్ట్రానికి ఏదైనా జరిగితే దానికి కేసీఆరే బాధ్యుడు
- బీఆర్ఎస్ ఆమోదంతోనే విభజన చట్టం వచ్చింది
- కృష్ణా జలాలను ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారు
- తెలంగాణకు 299 టీఎంసీలు చాలని అప్పట్లో కేసీఆర్ అన్నారు
- కృష్ణా జలాల్లో అన్యాయం కేసీఆర్ పాపమే
- 2014లోనే కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించడానికి పునాది పడింది
- జగన్రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకున్నారు
- బాబు కూడా చేతనైనంత దెబ్బ వేసిర్రు
- జలదోపిడీకి కారణం కేసీఆరే
- కమీషన్లకు కేసీఆర్ లొంగిపోయారు
- పదేళ్లలో టన్నెల్ కొట్టింది ఒకేఒక కిలోమీటర్
- ఆ పాపానికి కారణం కూడా చంద్రశేఖరరావే
- సాగర్ మీదికి రమ్మను జగన్మోహన్రెడ్డిని
- మమ్మల్ని బద్నాం చేస్తున్నావా
- కొడుకును, బిడ్డను కూడా తెచ్చుకోండి
- చర్చకు రాకుండా ముఖం చాటేయకు కేసీఆర్
Peddireddy Ramachandra Reddy: అందుకే వీరికి పార్టీ టికెట్ నిరాకరించింది: మంత్రి పెద్దిరెడ్డి