Jagga Reddy: కేసీఆర్ బాధ కరెంట్ గురించి కాదు..: జగ్గారెడ్డి

గత్యంతరంలేకే కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారని చెప్పారు. పదేళ్లు కేసీఆర్..

Jagga Reddy: కేసీఆర్ బాధ కరెంట్ గురించి కాదు..: జగ్గారెడ్డి

jagga reddy

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ కరెంట్ గురించి కాదని, రాజకీయంగా ఆయనకు పవర్ లేకుండా పోవడమే ఆయన బాధ అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణలో కరెంటు కోతలు జరుగుతున్నాయని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఇవాళ హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మాట్లాడారు.

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో భోజనం చేసేటప్పుడు మూడు సార్లు కరెంట్ పోయిందని కేసీఆర్ చెబితే నమ్మేవారు ఎవరూలేరని అన్నారు. నిజాలను అసత్యాలుగా మార్చి ఎలా చెప్పాలో కెసిఆర్ కి బాగా తెలుసని చెప్పారు. కేసీఆర్ సీఎంగా ఉన్నపుడు ప్రజలు గుర్తులేరని, ప్రతిపక్షంలోకి వచ్చాక ప్రజలు గుర్తొచ్చారా అని నిలదీశారు.

గత్యంతరంలేకే కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారని చెప్పారు. పదేళ్లు కేసీఆర్ ఎప్పుడైనా సెక్రటేరియట్ లో ప్రజలకి అందుబాటులో ఉన్నారా అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 14 పార్లమెంట్ సీట్లు రావాలని, తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని జగ్గారెడ్డి చెప్పారు.

వారిపై పోలీసులకు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం: కిషన్ రెడ్డి