కరోనాపై వీడియో కాన్ఫరెన్స్ : మోడీకి సూచనలిచ్చిన కేసీఆర్

కరోనా కట్టడికి కేంద్రం పటిష్ట చర్యలు తీసుకుంది. వైరస్ వ్యాప్తి నివారణకు ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో పాల్గొన్న సీఎం కేసీఆర్ కరోనా నివారణకు సంబంధించి పలు సూచనలు చేశారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా CCMBని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో ఉన్న సీసీఎంబీని కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి ల్యాబ్ గా ఉపయోగించేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తికి చేశారు.
దీన్ని ఉపయోగించుకోవడంతో కేవలం తెలంగాణలోని వారికే కాదని..ఎక్కడి వారికైనా ఇక్కడ రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని మోదీకి వివరించారు. సీసీఎంబీని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది. దీన్ని జీవ సంబంధ పరిశోధనల కోసం ఉపయోగిస్తున్నారు. ఇక్కడ వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి అవకాశం కల్పిస్తే ఒకేసారి వెయ్యి శాంపిల్స్ పరీక్షించే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి ప్రధాని దృష్టికి తెచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేపట్టాల్సిన చర్యలపై ప్రధాన మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ వైరస్ను నివారించే విషయంపై మోదీకి వివరించారు.
See Also | గ్రామాల్లో 144 సెక్షన్: పంచాయితీ కార్యదర్శులకు కీలక ఆదేశాలు
దేశంలోని అతి పెద్ద నగరాలైన ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లకు పెద్ద సంఖ్యలో విదేశాల నుంచి ప్రయాణీకులు వస్తారని.. వారిని క్షుణ్ణంగా పరీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కువ జనసమ్మర్థం ఉండే ఈ నగరాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి..అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే వైరస్ ప్రబలే అవకాశం ఉన్నందున.. కొద్ది రోజుల పాటు విదేశాల నుంచి విమాన రాకపోకలను పూర్తిగా నిలిపి వేయాలని కోరారు.
రైల్వే స్టేషన్లు, రైలు బోగీలలో హై శానిటేషన్ నిర్వహించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో జనం గుమి గూడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని..శ్రీరామ నవమి, జగ్నే కీ రాత్ లాంటి పండుగల సందర్భంగా కూడా ఉత్సవాలు బంద్ చేసినట్లు వివరించారు. కరోనా వైరస్ దేశంలో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు సీఎం కేసీఆర్.
Read More : ఏపీలో కరోనా : కృష్ణాలో 787 మంది గృహ నిర్భందం