Trains Cancelled : ప్రయాణికులు లేని కారణంగా 24 రైళ్లు రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే
తగినంత మంది ప్రయాణికులు లేని కారణంగా జూన్ నెలలో కొన్ని మార్గాలలలో నడిచే 24 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
![Trains Cancelled : ప్రయాణికులు లేని కారణంగా 24 రైళ్లు రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే Trains Cancelled : ప్రయాణికులు లేని కారణంగా 24 రైళ్లు రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే](https://10tv.in/wp-content/uploads/2021/05/scr-railway.jpg)
Scr Railway
Trains Cancelled : తగినంతమంది ప్రయాణికులు లేని కారణంగా జూన్ నెలలో కొన్ని మార్గాలలలో నడిచే 24 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తిరుపతి-విశాఖపట్నం, సికింద్రాబాద్-యశ్వంత్పూర్ 2,3 వ తేదీల్లో
తిరుపతి-చెన్నై 1వ తేదీన.. సికింద్రాబాద్-షిరిడీ 4,5న.. విజయవాడ-లింగంపల్లి, విజయవాడ-షిరిడీ, తిరుపతి-మన్నార్గుడి, కాచిగూడ-రేపల్లె, కాకినాడ-రేణిగుంట 1,2న..బిట్రగుంట-చెన్నై రైలును 1వ తేదీన రానుపోను రద్దు చేశారు.
నాందెడ్-ఔరంగాబాద్, ఔరంగాబాద్-రేణిగుంట 4న, ఔరంగాబాద్-నాందెడ్ 7న, రేణిగుంట-ఔరంగాబాద్ రైలును 5వ తేదీన రద్దు చేశారు. ఇక, నాందెడ్-తాండూరు రైలు జూన్ 1 నుంచి 15 వరకు సికింద్రాబాద్ నుంచి మాత్రమే నడుస్తుంది.
తాండూరు-పర్బని రైలును తాండూరు-సికింద్రాబాద్, నాందెడ్-పర్బని మధ్య 2 నుంచి 16 వరకు నడపనున్నారు.
హైదరాబాద్-తిరుపతి-వాస్కోడిగామ రైలు 3 నుంచి 10 వరకు హుబ్లీ, వాస్కోడిగామ మధ్య..వాస్కోడిగామ-తిరుపతి-హైదరాబాద్ రైలు 4 నుంచి 11వ తేదీ వరకు వరకు వాస్కోడిగామ, హుబ్లీ మధ్య మాత్రమే తిరుగుతాయి.