భార్యపై అనుమానం : కరోనా మందు అని చెప్పి..జైలు పాలయ్యాడు

భార్యపై అనుమానం : కరోనా మందు అని చెప్పి..జైలు పాలయ్యాడు

భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని అనుకున్నాడు. ఎలాగైనా ప్రతికారం తీర్చుకోవాలని అనుకున్నాడు. ప్రస్తుతం ప్రబలుతున్న కరోనా వైరస్ ను చక్కగా వాడుకుని వారిని అంతమొందించాలని పథకం పన్నాడు. కానీ ఈ ప్లాన్ బెడిసి కొట్టడంతో జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. 

ఆలీపూర్ లో ప్రదీప్ (42) కుటుంబం నివాసం ఉంటోంది. హోం గార్డుతో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని ప్రదీప్ అనుమానించాడు. దీంతో హోం గార్డు కుటుంబాన్ని అంతమొందించాలని పథకం పన్నాడు. కరోనా వైరస్ ను చక్కగా ఉపయోగించుకోవాలని అనుకున్నాడు. ఇద్దరు మహిళలను ఎంచుకున్నాడు. హోం గార్డు ఇంటికి ఆరోగ్య కార్యకర్తలుగా వెళ్లి..కరోనా మందు ఇవ్వాలని సూచించాడు.

ముందుగానే ఆ మందులో విషం కలిపాడు. మహిళలు హోంగార్డు ఇంటికి వెళ్లి కరోనా నివారణకు మందు అని, దీనిని తాగాలని సూచించారు. పాపం..ఈ విషయం తెలియని..హోం గార్డు కుటుంబం..మందును సేవించారు. వెంటనే అస్వస్థతకు గురి కావడంతో..స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ఎలాంటి అపాయం కలుగలేదు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇతని ఇంటికి సమీపంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. ఇద్దరు మహిళలు వీరింటికి వచ్చినట్లుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకోగా..అసలు నిజాన్ని చెప్పారు. దీంతో..ప్రదీప్ ను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. 

Read: COVID-19 quarantine centreలో మహిళల వీడియోలు తీసిన ఇద్దరి అరెస్టు