Hyderabad : డ్రగ్స్ కేసులో లక్ష్మీపతి కోసం పోలీసుల గాలింపు
రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం నియంత్రించటం కోసం పోలీసులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రేమ్ అనే డ్రగ్స్ పెడ్లర్ ను అరెస్ట్ చేయటంతో డొంక
Hyderabad : రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం నియంత్రించటం కోసం పోలీసులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రేమ్ అనే డ్రగ్స్ పెడ్లర్ ను అరెస్ట్ చేయటంతో డొంక కదిలింది.
ఈకేసులో ప్రధాన నిందితుడు లక్ష్మీపతికోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. లక్ష్మీపతి హ్యాష్ ఆయిల్ ను దిగుమతి చేసుకుని సప్లయ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రధానంగా విద్యా సంస్ధలు, రోజువారి కూలీలు, పారిశ్రామిక వేత్తలు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. విద్యార్ధులు గోవాలో జరిగే పార్టీలకు వెళ్లి డ్రగ్స్ కు ఎడిక్ట్ అవుతున్నట్లు గుర్తించారు.
Also Read : Hyderabad : స్టార్ హోటల్లో లక్ష రూపాయలు చోరీ
ఈకేసులో ఒక ప్రైవేట్ ఉద్యోగితో పాటు గిటార్ ప్లేయర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లక్ష్మీపతి ద్వారా తెలంగాణలోని పలు ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం లక్ష్మీపతి గోవాలో ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. గోవాలో ఉన్న లక్ష్మీపతిని అరెస్ట్ చేసేందుకు స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేశారు పోలీసులు. రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు.