Jagadish Reddy: కాంగ్రెస్‌ను నమ్మితే ఏమవుతుందో తెలుసుకునేందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇది: మంత్రి జగదీశ్ రెడ్డి

మేడిగడ్డ ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని, అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న..

Jagadish Reddy: కాంగ్రెస్‌ను నమ్మితే ఏమవుతుందో తెలుసుకునేందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇది: మంత్రి జగదీశ్ రెడ్డి

Jagadish Reddy

Assembly Elections 2023: కాంగ్రెస్‌ను నమ్మితే ఏమవుతుందో తెలుసుకునేందుకు ప్రత్యక్ష ఉదాహరణ కర్ణాటకలోని పరిస్థితులని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కర్ణాటక రైతులను కాంగ్రెస్ మోసం చేస్తోందని, 3 గంటలకు మించి కరెంట్ ఇవ్వడం లేదని తెలిపారు. 2014 ఎన్నికలకు ముందు తెలంగాణలో పరిస్థితి ఎలా ఉండేదో కర్ణాటకలో ఇప్పుడు అదే పరిస్థితి ఉందని చెప్పారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ విద్యుత్ విషయంలో ఇదే పరిస్థితి నెలకొందని జగదీశ్ రెడ్డి తెలిపారు. ఛత్తీస్‌గఢ్, కర్ణాటక తరహా పాలన ఇక్కడ కావాలా అని నిలదీశారు. కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలు నమ్మితే రైతులు, ప్రజలు మోసపోతారని అన్నారు. కర్ణాటకలో 14 వేల మెగా వాట్ల విద్యుత్ అవసరమని చెప్పారు.

కర్ణాటకలో సగం ఉన్న తెలంగాణలో 15 వేల మెగా వాట్ల విద్యుత్ ను ఎటువంటి ఇబ్బందులూ లేకుండా అందిస్తున్నట్లు జగదీశ్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని, అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను పట్టించు కోవాల్సిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ నేత జానారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. బీజేపీ నేతలకు అభ్యర్థులు లేరని అన్నారు.

Revanth Reddy: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ప్రమాదంపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్