AP Corona : ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. కొత్తగా ఎన్ని కేసులంటే..

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. మళ్లీ కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మొన్నటి వరకూ తగ్గుముఖం పట్టిన కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ నుంచి

AP Corona : ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. కొత్తగా ఎన్ని కేసులంటే..

Ap Corona

Updated On : September 5, 2021 / 9:06 PM IST

AP Corona : ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. మళ్లీ కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మొన్నటి వరకూ తగ్గుముఖం పట్టిన కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకున్న ఏపీలో కొద్దికాలంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపుగా తగ్గిపోయింది. అయితే 3-4 రోజుల నుంచి మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నట్టు కన్పిస్తోంది. మొన్నటి వరకూ ఓ దశలో రోజుకు వెయ్యికి దిగువకు చేరుకున్న కేసులు.. ఇప్పుడు మళ్లీ 15 వందలు దాటుతున్నాయి.

Whats App Hacking : తల్లి వాట్సప్ హ్యాక్ చేసి, ఆమె ప్రియుడ్నిబ్లాక్ మెయిల్ చేసి…

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 65వేల 596 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1,623 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2021325కి చేరింది. మరో 8 మంది వైరస్ తో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 13వేల 911 కి చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 1,340 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. కొత్తగా కోలుకున్నవారితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 1992256కి చేరింది.

Costly Cottage : నీరు లేదు, కరెంటూ లేదు.. అయినా ఈ కాటేజీ ధర రూ.5 కోట్లు, ఎందుకంత రేటు అంటే..

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 15వేల 158 యాక్టివ్ కేసులున్నాయి. నేటివరకు రాష్ట్రంలో 2,69,39,087 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ వల్ల కొత్తగా చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు. కాగా తూర్పు గోదావరి జిల్లాలో ప్రమాదకరంగా 342 మందికి వైరస్ సోకింది. చిత్తూరు జిల్లాలో 276 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.