Top Headlines : కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే : సీఎం కేసీఆర్‌

రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అంటూ కేసీఆర్‌ అన్నారు.

Top Headlines : కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే : సీఎం కేసీఆర్‌

Updated On : November 16, 2023 / 5:37 PM IST

తీర్పు రిజర్వ్‌..
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలు ముగియగా తీర్పును ధర్మాసం రిజర్వు చేసింది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు తరపు లాయర్ల వాదనలు ముగిశాయి. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనల్లో భాగంగా  సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఆరోగ్య రిపోర్టులన్నీ తప్పుడివి అని అన్నారు. మూడు 10 రూపాయలు నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్ల రూపాయలను చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా హైదరాబాద్ తరలించారని, బోస్ అనే వ్యక్తి ఫోన్ మెసేజ్ ల ద్వారా ఈ విషయం బయటపడిందని  తెలిపారు… Read More

సీఎం రివ్యూ..
జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై సీఎం జగన్ సమీక్ష్ జరిపారు. ఈ సందర్భంగా జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై ఫోకస్‌ చేయాలి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం జగన్ సూచించారు.

వెయిట్‌ అండ్‌ సీ..
రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు.ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అంటూ కేసీఆర్‌ జోస్యం చెప్పారు.

క్లారిటీ ప్లీజ్‌ ..
బీజేపీ,బీఆర్ఎస్‌తో కలిసే పనిచేస్తున్నాయి అంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై బండి సంజయ్‌ సీరియస్ అయ్యారు. తాము అమ్ముడుపోమని కాంగ్రెస్‌ గ్యారెంటీ ఇస్తుందా..? అని ప్రశ్నించారు.

జోరుగా.. హుషారుగా..
తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో హోరా హోరీగా ప్రచారాలు సాగిస్తున్నారు. దీంట్లో భాగంగా రేపు తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారం నిర్వహించనున్నారు. దీని కోసం రాహుల్ గాంధీ రేపు తెలంగాణలో విస్తృత పర్యటను చేయనున్నారు. అలాగే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కూడా మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. 18న షా తెలంగాణలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

హామీల హస్తం..
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పటికే ఆరు గ్యారంటీల హామీలను ప్రకటించింది. తాజాగా రేపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ తాజ్ కృష్ణాలో కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయనున్నారు. దీంట్లో ధరణి స్థానంలో కొత్త యాప్, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు వంటివి ఉండనున్నాయి.

రెయిన్‌ వార్నింగ్‌ ..
బంగాళఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో వర్షాలు కురవనున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

రేపే పోలింగ్‌..
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో భాగంగా రేపు మధ్యప్రదేశ్‌లో ఎన్నికలకు ఈసీ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.చత్తీస్‌గఢ్‌లోనూ రెండో విడత ఎలక్షన్స్‌ సందర్భంగా ఏర్పాట్లు జరిగాయి.

కట్టడికి చర్యలు..
కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటోంది. శీతాకాలం రోజుల్లో ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్య ప్రతీ ఏటా పెరుగుతోంది. ఈ కాలుష్య నియంత్రణ కోసం ఆరుగురు సభ్యులతో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసింది ఢిల్లీ ప్రభుత్వం.

డైలాగ్‌ వార్‌..
రాజస్థాన్‌లో నడ్డా, రాహుల్‌ ప్రచారాల్ని ముమ్మరం చేశారు. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది. దీంట్లో భాగంగా బీజేపీ, కాంగ్రెస్‌ పరస్పర విమర్శలు సంధించుకుంటున్నాయి.

ఎలా ఉన్నారో..?
ఉత్తరాఖండ్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 40 మంది కార్మికులు ఐదు రోజులుగా టన్నెల్‌లోనే చిక్కుకుపోయవటంతో వారి క్షేమంపై ఆందోళన నెలకొంది.

ఎన్‌కౌంటర్‌..
జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. కుల్గాంలో జవాన్లు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్న క్రమంలో భద్రతాదళాలు ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి.