టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

  • Published By: vamsi ,Published On : September 22, 2019 / 01:17 PM IST
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

Updated On : September 22, 2019 / 1:17 PM IST

దక్షిణాఫ్రికాతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ(22 సెప్టెంబర్ 2019) జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు. మొహాలి టీ20లో ఆడిన జట్టే ఈ మ్యాచ్ లో కూడా ఆడుతుంది.

మూడు టీ20ల ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు టీ20లు ముగియగా..  తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈరోజు మ్యాచ్‌లో గెలవడం ద్వారా సిరీస్‌ని 2-0 కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తుంది. ఆఖరి టీ20లో గెలిచి పరువు నిలుపుకోవాలని సౌతాఫ్రికా అనుకుంటుంది.

టీ20 రికార్డుల పరంగా చూసుకుంటే సఫారీలపై టీమిండియాదే ఆధిపత్యంగా ఉంది. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 14 సార్లు తలపడగా.. 9 మ్యాచ్‌ల్లో భారత్ విజయం దక్కించుకుంది. టీ20 సిరీస్‌ ముగిసిన తర్వాత అక్టోబరు 2వ తేదీ నుంచి మూడు టెస్టుల సిరీస్‌ జరగనుంది.

జట్లు:

భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య , కృనాల్‌ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, నవదీప్ షైనీ

దక్షిణాఫ్రికా: డికాక్ (కెప్టెన్), నొర్జీ, డసెన్, బవుమా, మిల్లర్, ఫెలుక్వాయో, ప్రిటోరియస్, జోర్న్ ఫార్చూన్, రబాడ, జూనియర్ డాలా, షంసీ.