Hyderabad: హైదరాబాద్లోని పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనాల దారి మళ్లింపు
Hyderabad: మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయి. చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్ను వివిధ పాయింట్ల వద్ద మళ్లిస్తున్నారు.

Hyderabad
Hyderabad: రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా హైదరాబాద్ (Hyderabad), పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. చార్మినార్-మదీనా, చార్మినార్-ముర్గీ చౌక్, చార్మినార్ -రాజేశ్ మెడికల్ హాల్, శాలిబండ మధ్య ప్రధాన రహదారుల్లో ఉదయం 9 గంటల నుంచి అన్ని రకాల వాహనాల రాకపోకలు నిలిపిశారు.
మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయి. చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్ను వివిధ పాయింట్ల వద్ద మళ్లిస్తున్నారు. నయాపూల్ వైపు నుంచి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్ను మదీనా జంక్షన్ వద్ద సిటీ కాలేజీ వైపు మళ్లిస్తున్నారు. అదే విధంగా హిమ్మత్పురా, చౌక్ మైదాన్ ఖాన్, మోతిగల్లి, ఈతేబార్ చౌక్, సెహర్-ఎ-బాటిల్ కమాన్, లక్కడ్ కోటే వద్ద ట్రాఫిక్ మళ్లిస్తున్నారు.
మక్కా మసీదుకు వచ్చే వాహనాలకు ఏడు వేర్వేరు చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా మక్కా మసీదు పరిసరాల్లో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రార్థనలు చేసుకునేందుకు వచ్చే వారి సౌకర్యార్థం పార్కింగ్, ఇతర సౌకర్యాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
Delhi Metro : స్కర్ట్లు ధరించి మెట్రో ఎక్కిన అబ్బాయిలు.. వింత పోకడలకు మండిపడుతున్న ప్రయాణికులు