అందరూ రాజమౌళి సినిమాల కోసం వెయిటింగ్.. ఆయన వెయిట్ చేసేది ఎవరి సినిమాల కోసమో తెలిస్తే..
తాజాగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

దర్శకుడు రాజమౌళి తీస్తున్న సినిమాల కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. అటువంటిది, రాజమౌళి మాత్రం కొందరు తీస్తున్న పాన్ ఇండియా సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా చెప్పారు.
తాజాగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఓ ప్రేక్షకుడిగా ప్రశాంత్నీల్-ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న సినిమా కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. అలాగే, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్, బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా కోసం వేచి చూస్తున్నానని అన్నారు.
పెద్ది సినిమా గ్లింప్స్ తాజాగా రిలీజ్ అయిందని చెప్పారు. ఈ మూడు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రూపుదిద్దుకుంటున్నాయి. కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమాకు డ్రాగన్ అనే పేరు ప్రచారంలో ఉంది.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్- ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ను ఇప్పటికే ప్రశాంత్ నీల్ మొదలుపెట్టేశారు. పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్కు సరసన రుక్మిణీ వసంత్ నటిస్తోంది.
ఇక ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగా లొకేషన్స్ వెతుకుతున్నారు. ఇక రామ్చరణ్ – బుచ్చిబాబు సినిమా పెద్ది 2025 మార్చి 27న రీలీజ్ కానుంది. డ్రాగన్, స్పిరిట్, పెద్ది సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.