తుపానులు, ఆర్థిక కష్టాల కంటే జగనే పెద్ద సమస్య : చంద్రబాబు

ఏపీకి అతి పెద్ద సమస్య జగనే అని సీఎం చంద్రబాబు అన్నారు.

  • Published By: veegamteam ,Published On : March 24, 2019 / 08:10 AM IST
తుపానులు, ఆర్థిక కష్టాల కంటే జగనే పెద్ద సమస్య : చంద్రబాబు

Updated On : March 24, 2019 / 8:10 AM IST

ఏపీకి అతి పెద్ద సమస్య జగనే అని సీఎం చంద్రబాబు అన్నారు.

అమరావతి : రాష్ట్రానికి అతి పెద్ద సమస్య జగనే అని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీకి తుపానులు, ఆర్థిక కష్టాల కంటే జగనే పెద్ద సమస్యని.. ఈ సమస్యను వదలించుకోవాలన్నారు. కేసీఆర్ తీరు మార్చుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో నిరసన చేసే పరిస్థితులు తెచ్చుకోవద్దని హితవు పలికారు.

టికెట్ దక్కించుకోలేకపోయిన పులపర్తి నారాయణ మూర్తి.. వైసీపీలో చేరుదామనుకొని మనసు మార్పుకున్నారని తెలిపారు. ఏ నాయకుడైనా అతి తెలివి ప్రదర్శిస్తే దండం పెట్టడం మినహా మరేం చేయలేనని అన్నారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుని పార్టీని మోసం చేద్దామనే ఆలోచనలు సాగవన్నారు.