Home » Author »bheemraj
హైదరాబాద్, విజయవాడల్లోని పలు ఐటీ కంపెనీల్లో సోదాలు చేశారు. ఐటీ శాఖనే బురిడి కొట్టించిన కంపెనీల వ్యక్తులపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అధికారం చేపట్టాలంటే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాల్సిందేనని సూచించారు. తన రాజకీయ అనుభవంతో చంద్రబాబుకు సలహా ఇస్తున్నానని హరి రామ జోగయ్య తెలిపారు.
కానిస్టేబుల్ రామయ్య అనుమానాస్పద మృతి కింద 174 సెక్షన్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రామయ్యతో పాటు వీధి నిర్వహణలో ఉన్న అధికారులను పోలీసులు విచారిస్తున్నారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, జగన్ సంక్షేమ పథకాలు దిగ్విజయంగా కొనసాగాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. దేవాలయంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు బోర్డు మీటింగ్ లో కొన్ని తీర్మానాలు చేస్తున్నామని చెప్పారు.
ఈ ఏడాది 3 లక్షల మంది భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి వస్తారని అధికారుల అంచనా. ఈ నేపథ్యంలో యాత్రికుల కోసం టెంట్లు, గూడారాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
రాజస్థాన్ లోని తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో భారీ వర్షాల కారణంగా చార్ ధామ్ యాత్రపై ప్రభావం పడే అవకాశం ఉంది.
కమాన్ చౌరస్తా సమీపంలో గాయాలతో బాధపడుతున్న పామును గమనించిన జంతు ప్రేమికులు పశు వైద్యశాలకు తీసుకెళ్లి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. పశు వైద్యులు వెంటనే స్పందించి పామును పరీక్షించారు. అత్యవసరంగా ఆపరేషన్ చేసి పామును బతికించారు.
రాష్ట్రంలో గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. నైరుతి దిశగా ఉపరితల గాలులు గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడిచింది.
మాడ్గుల మండలం నుంచి తొమ్మిది గ్రామాలు ఇర్విన్, బ్రాహ్మణపల్లి, అర్కపల్లి, అండుగుల, అన్నెబోయినపల్లి, సుద్దపల్లి, గిరికొత్తపల్లి, కలకొండ, రమణపల్లిని వేరు చేస్తూ కొత్త మండలం ఏర్పాటు చేసింది.
పాఠశాలల నిర్వహణ పేరుతో పథకానికి కోతలు పెట్టిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. 'విద్యారంగంపై మీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ...విద్యా ప్రమాణాలు మాత్రం గడప దాటడం లేదు' అని ఎద్దేవా చేశారు.
పెద్ద సంఖ్యలో ప్రజలు ఇనుముతో చేసిన రథాన్ని జనం లాగుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ హైటెన్షన్ వైర్లను రథం తాకింది. దీంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తో మంటలు చెలరేగాయి.
పాడి కౌశిక్ రెడ్డి.. ఒక కెమెరా మెన్ ను కులం పేరుతో బూతులు తిట్టి అవమానించారని ఆరోపించారు. గవర్నర్ కు కూడా కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్ రెడ్డి చలరేగిపోతున్నాడని ఆరోపించారు. హుజురాబాద్ లో ఓ పిచ్చి కుక్కను ఎమ్మెల్సీ చేసి వదిలి పెట్టారని కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి ఈటల జమున వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ తాజాగా ప్రారంభించిన ఐదు రైళ్లతో కలిపి దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య 23కు చేరింది. అత్యాధునిక సదుపాయాలతో సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లను తయారు చేశారు.
నగరంలోని స్కూల్స్ కి దీపావళి పండుగ రోజున సెలవు ఇవ్వాల్సిందేనంటూ న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెనిఫర్ రాజ్ కుమార్ చాలాకాలంగా డిమాండ్ చేస్తోన్నారు.
నెల్లూరులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర నివాసంలో ఆ పార్టీ కీలక నేతలు భేటీ అయ్యారు. నెల్లూరులో రాజకీయ పరిణామాలు, నారా లోకేష్ యువగళం పాదయాత్రపై చర్చించారు.
2010లో చిక్ మంగళూరు జిల్లా కడూర్ తాలూకాలోని ముగలికట్టెలో నరసింహస్వామి ఉత్సవాలు జరిగాయి. స్వామివారి ఊరేగింపు సందర్భంగా ఇతర గ్రామస్తులతో కలిసి ఓంకారప్ప అనే వ్యక్తి డ్యాన్స్ చేస్తుండగా పరమేశ్వరప్ప అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు.
రాష్ట్రీయ రైఫిల్ జవాన్ల బృందం 10 మంది యువకులను అదుపులోకి తీసుకొని తీవ్రంగా కొట్టినట్లు గ్రామస్థులు తెలిపారు.
బోడుప్పల్ బుద్ధ నగర్ కు చెందిన అవినాష్ రెడ్డి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారని, ఆ యువతి తన అవసరం కోసం అవినాష్ రెడ్డి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసున్నారని డీసీపీ పేర్కొన్నారు.
యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే అకౌంట్ లో రూ.150 జమ అవుతాయని మోసానికి పాల్పడ్డారు. ఒకరి నుంచి మరొకరిని యాప్ లో చేర్చుకుంటే భారీగా డబ్బులొస్తాయని నమ్మించి కేటుగాళ్లు మోసగించారు.