Telangana లో తగ్గుతున్న కరోనా కేసులు..24 గంటల్లో 1,379

COVID 19 in Telangana : తెలంగాణాలో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 1,378 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,87,211 కేసులు నమోదు అయ్యాయి.
కరోనాతో 7 మంది మరణించారు. ఇప్పటి వరకు 1107 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 29,673గా ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ వెల్లడించింది.
తెలంగాణాలో ఇప్పటి వరకు 1,56,431 మంది కోలుకున్నారు. 24 గంటల్లో 1,932 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 83.55% శాతంగా ఉంది. మరణాలు మాత్రం 0.59 శాతంగా ఉంది. 35,465 పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 28,86,334 పరీక్షలు చేశారు.
జిల్లాల వారీగా కేసులు :
ఆదిలాబాద్ 13. భద్రాద్రి కొత్తగూడెం 49. జీహెచ్ఎంసీ 254. జగిత్యాల 39. జనగామ 23. జయశంకర్ భూపాలపల్లి 13. జోగులాంబ గద్వాల 21. కామారెడ్డి 14. కరీంనగర్ 78. ఖమ్మం 26. కొమరం భీం ఆసిఫాబాద్ 5. మహబూబ్ నగర్ 24.
మహబూబాబాద్ 47. మంచిర్యాల 25. మెదక్ 12. మేడ్చల్ మల్కాజ్ గిరి 71. ములుగు 18. నాగర్ కర్నూలు 30. నల్గొండ 53. నారాయణపేట 11. నిర్మల్ 22. నిజామాబాద్ 55. పెద్దపల్లి 22. రాజన్న సిరిసిల్ల 38. రంగారెడ్డి 110. సంగారెడ్డి 50. సిద్దిపేట 61. సూర్యాపేట 33. వికారాబాద్ 22. వనపర్తి 25. వరంగల్ రూరల్ 21. వరంగల్ అర్బన్ 58. యాదాద్రి భువనగిరి 33. మొత్తం : 1378.
Telugu : Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 28.09.2020)#TelanganaFightsCorona #StayHome #StaySafe
For complete Bulletin.. please click on below link ?https://t.co/nJ24zLHdOe pic.twitter.com/RX2ioOcrNA
— Eatala Rajender (@Eatala_Rajender) September 28, 2020