Revanth Reddy: చంద్రబాబుకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ

పూలే ప్రజాభవన్‌లో భేటీ అవుదామని చెప్పారు. విభజన పెండింగ్ సమస్యల...

Revanth Reddy: చంద్రబాబుకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం లేఖ రాసిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలను చంద్రబాబు లేఖలో ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి కలిసి చర్చించుకుందామని చెప్పారు.

దీంతో దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ చంద్రబాబుకి లేఖలో జవాబు పంపారు. చంద్రబాబు లేఖను స్వాగతించారు. ఇరు రాష్ట్రాల ఉమ్మడి సమస్యలపై ఈ నెల 6న సమావేశమై చర్చిద్దామని అన్నారు. మధ్యాహ్నం తర్వాత పూలే ప్రజాభవన్‌లో భేటీ అవుదామని చెప్పారు. విభజన పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం చాలా ఉపయోగపడుతుందని తెలిపారు.

పెండింగ్ సమస్యలపై అభిప్రాయాలను పంచుకుంటూ సహకార దృక్పథంతో ముందుకు వెళ్దామని అన్నారు. ఈ సమావేశం వల్ల ఇరు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని చెప్పారు. అలాగే, అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చంద్రబాబుకు రేవంత్ రెడ్డి మరోసారి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటినప్పటికీ ఇప్పటికీ కొన్ని అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. వీటిపై ఈ నెల 6న చర్చించుకుందామని చంద్రబాబు సోమవారం ప్రతిపాదించారు.

పవన్ కల్యాణ్ ఎంట్రీ.. యువతి మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు, 9 నెలల తర్వాత ఆచూకీ లభ్యం