మీ దగ్గర రూ.2వేల నోటు ఉందా?

ఎలా మార్చుకోవాలని కంగారు పడుతున్నారా?

చాలా సులభంగా రూ.2వేల నోటుని మార్చుకోవచ్చు.

ఇప్పటికిప్పుడే రూ.2వేల నోట్ల చెల్లుబాటు ఆగిపోదు.

వాటితో నగదు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.

మే 23 నుంచి మాత్రమే ఈ నోట్లను మార్చుకునే వీలుంటుంది.

సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది.

బ్యాంకుల్లో మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేసుకోవచ్చు.

అన్ని బ్యాంకు శాఖలతో పాటు దేశవ్యాప్తంగా ఆర్బీఐకి ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు.

నోట్లు మార్చుకునేందుకు ఖాతా ఉన్న బ్యాంకులకే వెళ్లాల్సిన అవసరం లేదు.

ఏ బ్యాంకులో అయినా మార్చుకోవచ్చు.

ఒక వ్యక్తి ఒకసారి రూ.20వేల వరకు మాత్రమే మార్చుకోవచ్చు.

నోట్ల మార్పిడికి ఎలాంటి ఛార్జీలు లేవు.

బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసుకోవడంపై ఎలాంటి పరిమితి లేదు.