ఎదిగే వయస్సు పిల్లల ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.

సరైన పోషకాహారాన్ని పిల్లలకు అందేలా చూసుకోవాలి. దీని వల్ల వారిలో వ్యాధినిరోధక శక్తి పెరగటమే కాకుండా మానసిక , శారీరక ఎదుగుదలకు అవకాశం ఉంటుంది.

పిల్లల ఆహారం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఎదుగుదలపై ప్రభాం చూపించటంమే కాకుండా అనారోగ్య సమస్యలు చుట్టుమేట్టే అవకాశం ఉంటుంది.

సమతుల్య ఆహారంలో అవసరమైన మొత్తంలో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ తగిన మొత్తంలో ఉండాలి.

కండరాలు బలోపేతంగా ఉండాలంటే జింక్‌, ఐరన్‌ ఉండే ఆహారాలను పిల్లలు తీసుకునే చూడాలి.

పచ్చని ఆకుకూరలు, కూరగాయలతో పాటు గుమ్మడి విత్తనాలు, గుడ్డు, మాంసాహారం అందించాలి.

విటమిన్ సి ఉండే కాలీఫ్లవర్‌, బ్రొకోలీ,బెల్‌పెప్పర్స్‌, వంటి తాజా కూరగాయలు, నారింజ, బత్తాయి, పైనాపిల్‌, జామ, స్ట్రాబెర్రీ, బొప్పాయి వంటి పండ్లు రోజవారి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

బీన్స్‌, చిక్కుడు, పుట్టగొడుగులు, పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఉండే సెలెనియం చిన్నారులకు ఎక్కువగా అందించాలి.

పాల ఉత్పత్తులు, గుడ్లు, మాంసాహారం, గింజలు వంటివి పిల్లల ఎదుగుదలకు ఉపకరిస్తాయి.

వెజిటబుల్‌ ఆయిల్స్‌, గింజధాన్యాలు, విత్తనాలు, ఆకుకూరలతోపాటు ఆకుపచ్చగా ఉండే కూరగాయలన్నింటినీ పిల్లల ఆహారంలో భాగం చేయాలి.

పులియబెట్టిన పెరుగుతోపాటు గుడ్డు, మాంసాహారం ద్వారా కే2 విటమిన్‌ పిల్లల ఎముకలను బలోపేతం చేస్తుంది.

సమతుల్య ఆహారం మీ బిడ్డ ఆరోగ్యంగా , ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా ఎదగటానికి సహాయపడుతుంది.