నాలుగోసారి: లాక్డౌన్ పొడిగించిన కేంద్రం
దేశంలో కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరువగా ఉంది. ఇటువంటి సమయంలో లాక్ డౌన్ పొడగింపు తప్పనిసరి అని భావించిన కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికీ నిత్యం వేలల్లో కరోనా కేసులు వస్తుండడంతో నాలుగో విడత లాక్ డౌన్ ప్రకటించింది. మే 31 తేదీ వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే మూడు సార్లు లాక్ డౌన్ విధించిన కేంద్రం. నాలుగోసారి కూడా పొడిగించింది.
ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా కొన్ని మినహాయింపులు ఇస్తున్నట్లు కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా కేంద్రం విడుదల చేస్తుంది.