కావేరీ పిలుస్తోంది : లక్ష మొక్కలు నాటుదాం అంటున్న సమంత

  • Published By: madhu ,Published On : August 25, 2019 / 02:47 AM IST
కావేరీ పిలుస్తోంది : లక్ష మొక్కలు నాటుదాం అంటున్న సమంత

కావేరి నది పరిరక్షణ కోసం ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత ముందుకొచ్చింది. సమంత సినిమాలతో బిజీగా వుంటూనే సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటుంది. ప్రత్యూష ఫౌండేషన్‌ను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కావేరి పిలుస్తోంది… లక్ష మొక్కలు నాటుదాం రండి అంటూ అభిమానులకు పిలుపునిచ్చింది. 

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ కావేరీ నది పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటాలని సంకల్పించిన సంగతి తెలిసిందే. ఆయనకు సమంత మద్దతు పలికారు. http://samantha.cauverycalling.org వెబ్ సైట్‌లో విరాళాలు అందించండి..మీరు నేను కలిస్తే..లక్ష మొక్కలని నాటేందుకు సహకరించగలం అంటూ సమంత పోస్టు చేశారు. ప్లకార్డు పట్టుకుని ఉన్న వీడియోను కూడా షేర్ చేశారు. రూ. 42 విరాళం అందిస్తే..ఒక మొక్కను నాటే వారవుతారని సమంత తెలిపారు. 

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే..ఓ బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం తమిళ హిట్ 96 తెలుగు రీమెక్‌లో నటిస్తున్నారు. ఇందులో శర్వానంద్ హీరోగా నటించాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Cauvery is calling .. will you respond … donate here ..samantha.cauverycalling.org .. link in bio . We can do this .. 1,00,000 trees .. you and I together ❤️ @isha.foundation #cauverycalling

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on