వైకుంఠపురం ఫ్యామిలీ దీపావళి శుభాకాంక్షలు
‘అల వైకుంఠపురములో’ : తెలుగు ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ మూవీ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది..

‘అల వైకుంఠపురములో’ : తెలుగు ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ మూవీ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ హీరో, హీరోయిన్లుగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న హ్యాట్రిక్ ఫిలిం.. ‘అల వైకుంఠపురములో’… ఇటీవల విడుదల చేసిన ‘సామజవరగమన’ పాట యూట్యూబ్లో రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 50 మిలియన్ల వ్యూస్ దాటేసింది.
ఇక దీపావళి కానుకగా అల్లు అర్జున్ వాయిస్తో స్టార్ట్ అయిన ‘రాములో రాములా.. నన్నాగంజేసిందిరో.. ‘రాములో రాములా.. నా పాణం తీసిందిరో.. అనే సాంగ్ విడుదల చేయగా.. సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. సోషల్ మీడియాను ఊపు ఊపేస్తుందీ పాట.. ఇప్పటికే లక్షకు పైగా లైక్స్ రావడం విశేషం..
Read Also : ‘డిస్కోరాజా’ జంటగా దీపావళి శుభాకాంక్షలు
తెలుగు ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ మూవీ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) కలిసి నిర్మిస్తున్న ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న భారీగా రిలీజ్ కానుంది.