నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో బాలయ్య నోట పలు పవర్ఫుల్ డైలాగులు పేలాయి. మరి ఆ పవర్ఫుల్ డైలాగులు ఏమిటో ఇక్కడ చూద్దామా.
నేనెవరో చెప్పే అలవాటు నాకు లేదు.జీవోను ఉన్నది ఉన్నట్టుగా అమలు చేస్తా.నీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్
సెంట్రల్ అయినా, స్టేట్ అయినా..రాజకీయాల మీద బతికే మనిషినికాదు..రాజకీయాల్ని మార్చే మనిషిని..!
కోసేవాడికి కోడి మీద పగ ఉండదు..నేనూ అంతే.. చాలా పద్ధతిగా నరుకుతా..!
నన్ను తట్టుకొని నిలవాలంటే మూడే దారులు..మారిపోవాలి.. పారిపోవాలి.. లేదంటే చచ్చిపోవాలి!
నువ్వు సవాలు విసరకు..
నేను శవాలు విసురుతా..!
అన్నం మీద గౌరవం లేనివాడు ఆకలికి పనికిరాడు..
అమ్మ మీద గౌరవం లేనివాడు భూమికి పనికిరాడు!