రాత్రి భోజనం చేసిన వెంటనే చాలామంది కాసేపు కునుకు తీస్తారు.
అది మంచి అలవాటు కాదు.
తిన్న వెంటనే నడిస్తే..
ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
భోజనం తర్వాత 10 నిమిషాల పాటు నడిస్తే..
శారీరకంగా చురుకుగా ఉంటారు.
జీర్ణక్రియ మెరుగై మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
భోజనం తర్వాత నడవటం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
తిన్న వెంటనే నిద్రపోవద్దు.