5లక్షల విలువైన గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్టు
ములుగు జిల్లాలో సుమారు 5లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
ములుగు జిల్లాలో సుమారు 5లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
ములుగు జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. తాడ్వాయి మండలం కటాపూర్ క్రాస్ దగ్గర పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేస్తుండగా టయోటా వాహనంలో క్వింటాల్ గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. సుమారు 5లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.