క్రెడిట్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్.
ఇకపై యూపీఐ పేమెంట్లు ఉచితంగా చేసుకోవచ్చు.
అంటే ఎలాంటి ఛార్జీలు ఉండవు.
అయితే, రూ.2వేల వరకు మాత్రమే లావాదేవీలు జరుపుకునే వెసులుబాటు.
అదీ రూపే క్రెడిట్ కార్డుల మీద మాత్రమే.
ఈ మేరకు ఎన్పీసీఐ సర్కులర్.
రూపే క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటు మొదలు.
దేశీయంగా అభివృద్ధి చేసిన పేమెంట్ గేట్ వేను ప్రోత్సాహించేలా.
మన దేశంలోని ప్రధాన బ్యాంకులన్నీ కూడా రూపే ఆధారిత క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి.
దాదాపు నాలుగేళ్లుగా ఈ రూపే కార్డులు వాడుకలో ఉన్నాయి.
వాటన్నింటినీ ఇప్పుడు యూపీఐ పేమెంట్ల కోసం వినియోగించేందుకు అవకాశం.