ఆస్పత్రి వెంటిలేటర్‌లో మంటలు..ఐదుగురు కరోనా రోగులు మృతి

  • Published By: nagamani ,Published On : May 12, 2020 / 07:39 AM IST
ఆస్పత్రి వెంటిలేటర్‌లో మంటలు..ఐదుగురు కరోనా రోగులు మృతి

రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ ఆస్పత్రిలో ఘోర ప్రమాదం జరిగింది. ఆస్పత్తి వెంటిలేటర్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు కరోనా రోగులు మరణించారు. ఓవర్‌లోడ్ వల్ల వెంటిలేటర్ లో మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తోంది. మరణించిన రోగులంతా వెంటిలేటర్ లోనే ఉండటం వల్ల మృతి చెందారు. 

సెంట్‌ పీటర్స్‌బర్గ్‌లో కరోనా రోగుల కోసం నిర్వహిస్తున్న ఆస్పత్రిలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు కరోనా రోగులు మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు ధ్రువీకరించారు. కానీ మృతుల సంఖ్య మాత్రం వెల్లడించలేదు. ఈ ప్రమాదం వెంటిలేటర్ లోని షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆస్పత్రిలో ఉన్న  150 మంది రోగులను మంటల నుంచి సురక్షితంగా తరలించామని దేశ అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది.  

గత శనివారం మాస్కోలోని ఆస్పత్రి‌లో అగ్నిప్రమాదం సంభించినప్పుడు అక్కడ కరోనాకు చికత్స పొందుతున్న రోగుల్లో ఒకరు మరణించారు.కాగా..రష్యాలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. సోమవారం (మే 11,2020) నాటికి 2 లక్షల 21 వేలకు పెరిగాయి. అంటే కరోనా ఏస్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. 

Read More:

ట్రంప్ అజాగ్రత్త 48వేల ప్రాణాలను బలిగొంది: సినీ నిర్మాత

కొంపముంచిన లాక్‌డౌన్ సడలింపు: జర్మనీలో భారీగా పెరిగిన కరోనా కేసులు