అమెరికాను వదిలి రష్యాపై విరుచుకుపడుతున్న కరోనా..రికార్డు స్థాయిలో కేసులు

  • Published By: venkaiahnaidu ,Published On : May 11, 2020 / 03:51 PM IST
అమెరికాను వదిలి రష్యాపై విరుచుకుపడుతున్న కరోనా..రికార్డు స్థాయిలో కేసులు

మొదట్లో ఇటలీ,బ్రిటన్,దక్షిణకొరియా,ఇరాన్ వంటి దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగినప్పటికీ క్రమంగా కేసుల సంఖ్య,మరణాల సంఖ్య తగ్గుతూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చాలా దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పకీ రష్యాలో మాత్రం రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇటలీ,బ్రిటన్ వంటి దేశాలను పక్కకునెట్టి ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదవుతున్న3వ దేశంగా రష్యా నిలిచింది.

కరోనా కేసుల నమోదులో అమెరికా మొదటిస్థానంలో ఉండగా,స్పెయిన్ రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. కరోనా కేసులు పరంగా ఇప్పుడు రష్యా మూడో అతి పెద్ద దేశం. రష్యాలో గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,656 కేసులు నమోదయ్యాయని ఆదివారం అక్కడి అధికారులు ప్రకటించారు. మరోవైపు ఒక్కరోజే కొత్తగా 98 కరోనా మరణాల సంభవించడంతో ఇప్పటి వరకూ 2వేల9 మంది రష్యాన్లు కరోనాకు బలైపోయారు.రష్యా రాజధాని మాస్కోలో పరిస్థితి దారుణంగా ఉంది.

రష్యా వ్యాప్తంగా నమోదవుతున్న కేసులు, మరణాలలో సగం వరకు ఇక్కడ నుంచే ఉండడం ఆందోళన కలిగించే విషయం. సోమవారం రోజున కొత్తగా 6,169 కేసులు పెరిగాయి. దీంతో అధికారిక లెక్కల ప్రకారం మాస్కోలో కేసుల సంఖ్య 1,15,909 కు చేరుకుంది. అయితే, అధిక సంఖ్యలో టెస్టులు జరపుతుండడంతోనే కేసుల సంఖ్య పెరుగుతోందని రష్యా అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ 56 లక్షల టెస్టులు జరిపినట్టు వారు తెలిపారు.

అయితే కరోనా వైరస్‌ తీవ్రతని ప్రపంచ దేశాలు గుర్తించక ముందే రష్యా గుర్తించింది. తొలి కేసు కూడా నమోదు కాకుండానే జనవరి 30న చైనాతో సరిహద్దుల్ని మూసేసింది. జనవరి 31న రష్యాలో రెండు కేసులు నమోదయ్యాయి. మార్చి 13 తర్వాత ఐరోపా దేశాలతో కూడా రాకపోకలను కూడా రష్యా నిలిపివేసింది. కానీ దేశంలో లాక్‌డౌన్‌ అమలు చేయడంలో ఆలస్యం చేసింది.

మార్చి 28 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించలేదు రష్యా ప్రభుత్వం. ప్రకటించిన తర్వాత కూడా కఠినంగా అమలు చేయడంలో విఫలమైంది. ప్రజలు బయటకొచ్చి ఇష్టారాజ్యంగా తిరగడం, ప్రజల్లో ఈ వైరస్‌ ఎంత ప్రమాదకారో పూర్తిగా అవగాహన కొరవడడం వంటి కారణాలతో కేసులు పెరిగిపోయాయి. ఇక,ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,201,014కి చేరుకుంది.284,152మరణాలు నమోదయ్యాయి. భారత్ లో 67,152కేసులు నమోదుకాగా,2,206మరణాలు నమోదయ్యాయి.