రెండు రోజుల క్రితం సైఫ్ నివాసంలోకి దుండగుడు చొరబడి దాడిచేసిన విషయం తెలిసిందే.

హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సైఫ్ మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ కానున్నారు.

నిందితుడ్నిపట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి.. కానీ ఇంకా పట్టుబడలేదని పోలీసులు అంటున్నారు.

దాడికేసుకు సంబంధించి పోలీసులు 50 మందిని విచారించినట్లు తెలిసింది.

30 పోలీసు బృందాలు నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

సైఫ్ సతీమణి కరీనా కపూర్ వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేశారు

పిల్లలను, మహిళలను నిందితుడి నుంచి కాపాడేందుకు సైఫ్ ప్రయత్నం చేశాడని

సైఫ్ పై దాదాపు ఆరు సార్లు నిందితుడు కత్తితో దాడిచేశాడని

నిందితుడు ఇంట్లో ఎలాంటి వస్తువును దొంగిలించలేదని కరీనా కపూర్ తన వాగ్మూలంలో పేర్కొన్నారు.