Arvind Kejriwal: తనకు ఒక్క అవకాశం ఇస్తే గుజరాత్లో అవినీతిని సమూలంగా నిర్ములిస్తానని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ..ఇప్పటి నుంచే ప్రచార పనులు ప్రారంభించింది. అందులో భాగంగా శనివారం అహ్మదాబాద్ లో ‘తిరంగ గౌరవ్ యాత్ర’ పేరిట ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు రోడ్డు షో నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్, మరియు గుజరాత్ రాష్ట్ర ఆప్ నేతలు పాల్గొన్నారు. ఈసందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ..25 ఏళ్ల పాటు గుజరాత్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని..దీంతో బీజేపీ అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు.
Also read:Bandi Sanjay: ప్రాణహిత పుష్కరాలకు తక్షణమే నిధులు కేటాయించాలి: బండి సంజయ్
ఇన్ని రోజులు బీజేపీకి అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ ఒక్కసారి ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఇవ్వాలని కేజ్రీవాల్ ఓటర్లను కోరారు. గుజరాత్ లో అధికారంలోకి వస్తే అవినీతిని నిర్ములిస్తామని ఆయన అన్నారు. గత రెండు దఫాలుగా తమ ప్రభుత్వ పాలనలో ఢిల్లీలో అవినీతిని అంతం చేశామని..ఇటీవల అధికారంలోకి వచ్చిన పంజాబ్ రాష్ట్రంలోనూ పదే పది రోజుల్లో అవినీతిని అంతమొందించినట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. రోడ్డు షో మొదలుపెట్టే ముందు..కేజ్రీవాల్ మరియు భగవంత్ మన్..అహ్మదాబాద్ లోని ఖోడియార్ మాతా ఆలయాన్ని మరియు సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. రెండు రోజుల పాటు గుజరాత్ లో పర్యటించనున్న ఆప్ నేతలు స్థానిక శ్రేణులతో సమావేశం అయి.. పార్టీ వ్యూహాలపై నిర్ణయం తీసుకొనున్నారు.
#WATCH | “…Delhi and Punjab sorted, now we are preparing for Gujarat…” says Punjab CM Bhagwant Mann as he holds a roadshow with AAP convenor and Delhi CM Arvind Kejriwal in Ahmedabad
Gujarat Assembly elections are due in the latter part of this year pic.twitter.com/kXYZh7iKSG
— ANI (@ANI) April 2, 2022
Also read:Arunachal Pradesh : ఇద్దరు పౌరులపై పొరపాటున ఆర్మీ కాల్పులు..