బుల్లితెరపై కూతురితో కలిసి మెరిసిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు గతంలో కొన్ని టీవీ షోలలో కనిపించి మెరిపించాడు. తాజాగా మహేష్ డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ అనే ఓ కొత్త షోకి గెస్టుగా వచ్చారు. అయితే ఈ సారి మహేష్ బాబు మాత్రమే రావడం కాదు సితారని కూడా తీసుకువచ్చారు.

కొత్త షో డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ నుంచి తాజాగా మహేష్, సితార గెస్టులుగా వచ్చిన చిన్న ప్రోమోని రిలీజ్ చేశారు.

ఈ ప్రోమోలో మహేష్, సితారలకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అక్కడున్న డ్యాన్సర్లు తో సితార స్టెప్పులు వేసింది. మహేష్ ఈ షోకి సితారతో కలిసి రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

చిన్న ప్రోమో వదిలితేనే మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయి దీనిని వైరల్ చేస్తున్నారు. ఫుల్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ షోలోపలి వెళ్లేముందు ఫ్యాన్స్ తీసిన మహేష్, సితార ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక ఈ షో షూటింగ్ కి నమ్రతా శిరోద్కర్ కూడా వచ్చింది కానీ స్క్రీన్ పై షోలో పాల్గొనలేదు.