మద్యం మత్తులో ట్రాన్స్ ఫార్మర్ ముట్టుకుని తాగుబోతు మృతి, జగిత్యాలలో దారుణం

జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం జరిగింది. మద్యం మత్తులో నానా హంగామా చేసిన ఓ వ్యక్తి చివరికి ప్రాణాల

  • Published By: naveen ,Published On : May 10, 2020 / 12:18 PM IST
మద్యం మత్తులో ట్రాన్స్ ఫార్మర్ ముట్టుకుని తాగుబోతు మృతి, జగిత్యాలలో దారుణం

జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం జరిగింది. మద్యం మత్తులో నానా హంగామా చేసిన ఓ వ్యక్తి చివరికి ప్రాణాల

జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం జరిగింది. మద్యం మత్తులో నానా హంగామా చేసిన ఓ వ్యక్తి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ట్రాన్స్ ఫార్మర్ ముట్టుకుని చనిపోయాడు. అంతకుముందు రోడ్డు మీద వెళ్తున్న వారిపై బండరాయితో ఆ తాగుబోతు దాడికి యత్నించాడు. ఆ తర్వాత ఓ మహిళపై దాడి చేశాడు. ఆ తర్వాత ట్రాన్స్ ఫార్మర్ ను ముట్టుకుని అక్కడికక్కడే చనిపోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు మృతుడి వివరాలు సేకరిస్తున్నారు. 

బండరాయితో దాడికి యత్నం:
మద్యం మత్తులో ఆ వ్యక్తి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. నానా హంగామా చేశాడు. గట్టిగా కేకలు వేశాడు. స్థానికులను భయాందోళనకు గురి చేశాడు. ఆ తాగుబోతుని చూసి రోడ్డు మీద వెళ్తున్న వారు పరుగులు తీశారు. చివరికి ఆ తాగుబోతు ట్రాన్స్ ఫార్మర్ ముట్టుకుని చనిపోయాడు. మద్యం మత్తులో ఆ వ్యక్తి చేసిన హంగామాను స్థానికులు వీడియో తీశారు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.

చేతిలో బండరాయితో గంటసేపు రోడ్డుపై హంగామా:
మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి ట్రాన్స్ ఫార్మర్ ను ముట్టుకోవడం, అలాగే ప్రాణాలు కోల్పోవడం వీడియోలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కోరుట్ల నంది చౌరస్తాలో ఈ ఘటన జరిగింది. దాదాపు గంట సేపు రోడ్డుపై వీరంగం చేసిన తాగుబోతు చివరికి ప్రాణాలు కోల్పోయాడు. బండరాళ్లు రోడ్డుపై వేశాడు. రోడ్డుపై వెళ్తున్న వారిని అడ్డుకుని భయపెట్టాడు. అసలే మద్యం మత్తులో ఉన్నాడు, చేతిలో బండరాయి ఉంది. దీంతో భయపడిన స్థానికులు అతడి దగ్గరికి వెళ్లేందుకు సాహసం చెయ్యలేదు. చివరికి రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ ఫార్మర్ దగ్గరికి వెళ్లిన ఆ వ్యక్తి దాన్ని ముట్టుకున్నాడు. షాక్ కొట్టడంతో స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మద్యం మత్తులో పాముని కొరికి చంపిన తాగుబోతు:
45 రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 5 రోజుల క్రితమే మద్యం షాపులు తెరిచారు. ఇన్నాళ్లు మద్యం దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తించిన మద్యం ప్రియులు ఇప్పుడు ఫుల్లుగా మందు తాగి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రంలో ఏదో ఒక మూల ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే కర్నాటకలో ఓ తాగుబోతు చేసిన పని దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తన బైక్ కి పాము అడ్డు వచ్చిందనే కోపంతో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి పాముని చేతిలోకి తీసుకుని దాన్ని తలను ముక్కలు ముక్కలుగా కొరికి చంపేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. మద్యం షాపులు తెరిచాక మద్యం మత్తులో కొందరు చేస్తున్న పనులు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.