ఏపీలో కరోనా @ 2051 : కొత్త కేసులు 33. 20 కోయంబేడ్ నుంచి వచ్చినవే
ఆంధ్రప్రదేశ్ను కరోనా కలవరపెడుతోంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రెండు వేల సంఖ్యను దాటడంతో ప్రజలు తీవ్ర భయాందోనళకు గురవుతున్నారు. 2020, మే 12వ తేదీ మంగళవారం కొత్తగా 33 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య 02 వేల 51 కు చేరుకుంది.
ఇందులో వేయి 56 మంది డిశ్చార్జ్ చేశారు. 43 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 949 గా ఉందని..ప్రభుత్వం హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కర్నూలు జిల్లాలో 584 కేసులు చేరగా..కృష్ణాలో 346, గుంటూరులో 357 అత్యధికంగా కేసులు నమోదయ్యాయని తెలిపింది.
చిత్తూరులో 10, నెల్లూరులో 09, తూర్పు గోదావరి జిల్లాలో 01 కేసు…మొత్తం…20 పాజిటివ్ కేసులు కోయంబేడ్ (తమిళనాడు) నుంచి వచ్చినవని వెల్లడించింది.
జిల్లాల వారీగా : అనంతపురం 115. చిత్తూరు 131. ఈస్ట్ గోదావరి 47. గుంటూరు 387. కడప 97. కృష్ణా 346. కర్నూలు 584. నెల్లూరు 111. ప్రకాశం 63. శ్రీకాకుళం 05. విశాఖపట్టణం 66. విజయనగరం 04. వెస్ట్ గోదావరి 68. ఇతరులు 27.
కోవిడ్ పరీక్షలు : గడిచిన 24 గంటల్లో 10 వేల 730 శాంపిల్స్ పరీక్షించగా..33 మందికి పాజిటివ్ ఉందని తేలింది.
డిశ్చార్జ్ అయిన వివరాలు : గడిచిన 24 గంటల్లో 58 మంది డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. కృష్ణా 35. కర్నూలు 17. అనంతపూర్ 03. కడప, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో కొత్తగా నమోదైన మరణాలు : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒక్కరు చనిపోయారు. కోవిడ్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 46కి పెరిగింది.
Read More: