భార్య గుడ్డుకూర వండలేదని కన్నకొడుకుని చంపేసిన తండ్రి

  • Published By: nagamani ,Published On : May 11, 2020 / 11:57 AM IST
భార్య గుడ్డుకూర వండలేదని కన్నకొడుకుని చంపేసిన తండ్రి

కట్టుకున్న పెళ్లాం కోడిగుడ్డు కూర వండలేదనే కోపంతో కన్నకొడుకు ప్రాణాలు తీసేశాడు ఓ తాగుబోతు తండ్రి. మద్యం మత్తులో తానేం చేస్తున్నాడో తెలియకుండా రాక్షసుడిగా మారిన తండ్రి చేతిలో ప్రాణం పోగొట్టుకున్న కొడుకు ఘటన శనివారం (2.5.2020) రాత్రి ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ జిల్లాలో జరిగింది. 

వివరాల్లోకి వెళితే..బులంద్‌షహర్‌ జిల్లాలోని నాగ్లా గ్రామంలో  నివసిస్తున్నాడు సుభాష్ బంజారా మద్యానికి బానిస. చుక్కపడందే ఉండలేడు. ఈ క్రమంలో సుభాష్ శనివారం రాత్రి ఫుల్ గా తాగి ఇంటికి వచ్చాడు. ఎగ్‌ కర్రీ చేశావా? అని భార్యను అడిగాడు. లేదని చెప్పింది భార్య. వెంటనే ఎగ్ కర్రీ చేయమని లేకపోతే నాలుగు తంతానని భార్యపై అంతెత్తున ఎగిరాడు. తాగి రావటమే కాక..రోజు ఏదోరకంగా హింసించే భర్తతో విసిగిపోయిన ఆమె గుడ్డు కూర వండేది లేదని తెగేసి చెప్పింది.
 దీంతో ఆ తాగుబోతు మొగుడికి కోపం తారాస్థాయికి చేరుకుంది. భార్యను ఇష్టమొచ్చినట్లుగా చితకబాదాడు. నాన్న అమ్మను గొడ్డును బాదినట్లుగా కొడుతుంటే బిక్కమొఖం వేసుకుని బిక్కుబిక్కుంటూ చూస్తుండిపోయాడు మూడేళ్ల కొడుకు. భార్యను ఎంత కొట్టినా కోపం తగ్గని సుభాష్ కన్ను అక్కడే ఉన్న కొడుకుపై పడింది. పసివాడు అని కూడా చూడకుండా దారుణంగా కొట్టాడు. తరువాత పరారైపోయాడు. ఆ వెంటనే అక్కడినుంచి పారిపోయాడు. 

సుభాష్‌ చేతిలో చిన్నారి తీవ్రంగా గాయపడటం తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కొడుకుని బంధువుల సహాయంతో ఖుజా ఏరియాలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. కానీ..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. తాగుబోతు భర్తకు బలైపోయిన బిడ్డను గుండెలకు హత్తుకుని గుండెలవిసేలా ఏడ్చిందాతల్లి. ఆ ఏడుపు చూసిన స్థానికులు..బంధువులు కూడా కంట తడిపెట్టారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న సుభాష్‌ కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. 

Read More:

తమ్ముడితో అక్రమ సంబంధం, అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించింది

* మొదటి భార్యకు విడాకులిచ్చాడు, రెండో భార్య ఆత్మహత్య, మూడో భార్యను హత్య చేశాడు