క్వారంటైన్‌ తప్పించుకోవటానికి రైలు నుంచి దూకేసిన వలస కూలీలు  

  • Published By: nagamani ,Published On : May 11, 2020 / 10:23 AM IST
క్వారంటైన్‌ తప్పించుకోవటానికి రైలు నుంచి దూకేసిన వలస కూలీలు  

Updated On : June 26, 2020 / 8:41 PM IST

క్వారంటైన్‌ తప్పించుకోవటానికి వలస కూలీలు చేయకూడని సాహసం చేశారు. ప్రయాణిస్తున్న రైలు నుంచి అమాంతం దూకేశారు. రోజులు బాగుండి బతికి బైటపడ్డారు. కానీ ఏ క్వారంటైన్‌ కైతే భయపడ్డారో దాని నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. ఈ ఘటన ఒడిశాలోని ఆంగుల్ జిల్లా మఝికాలో చోటుచేసుకుంది. 

కరోనా మహమ్మారి ప్రపంచాన్నే అతలాకుతలం చేసేస్తోంది. కరోనాను కట్టడి చేసే ప్రక్రియలో భాగంగా భారత్ లాక్ డౌన్ ప్రకటించింది. ఈ లాక్ డౌన్ తో దేశవ్యాప్తంగా ఉపాధి కోల్పోయిన లక్షలాదిమంది వలస కూలీలు తమ తమ స్వగ్రామాలకు వెళ్లిపోవాలని తపన పడుతున్నారు. వలస వచ్చిన ప్రాంతంలో పనులు లేక..తినటానికి తిండి లేక నానా కష్టాలు పడుతున్న వారికి కేంద్ర  ప్రభుత్వం ‘శ్రామిక్‌స్పెషల్‌ రైళ్ల’ను ఏర్పాటు చేసింది. ఈ శ్రామిక్ రైళ్లలో వారి వారి స్వస్థలాలకు తరలించే చర్యలు చేపట్టింది. 

ఈ రైళ్ల ద్వారా వారి వారి గ్రామాలకు వెళ్లేందుకు శ్రామిక్‌స్పెషల్‌ రైళ్లలో గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌ నుంచి ఒడిశాకు చెందిన వలస కార్మికులు సొంతూళ్లకు బయల్దేరారు. మరి కొద్ది సమయానికి వారి ఇళ్లకు చేరుతామని వారు ఆనందపడిపోయారు. కానీ ఒడిశా చేరగానే తమను క్వారంటైన్‌ కు తరలిస్తారనే విషయం వారికి తెలిసింది. దీంతో వారు భయపడిపోయారు. క్వారంటైన్‌ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకున్నారు. దీంతో 20 మంది ప్రయాణిస్తున్న రైలు నుంచి దూకేశారు. కానీ అదృష్టం బాగుండి ప్రాణాలతో బైటపడ్డారు. 

కాగా..పలు ప్రాంతాల నుంచి ఒడిశాకు వచ్చే వారు తప్పనిసరిగా 28 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలని అక్కడి ప్రభుత్వం  మూడు రోజుల క్రితం కొత్త నిబంధనను అమలులోకి  తెచ్చింది. ఇది  తెలుసుకొన్న వలసకూలీలు 28 రోజుల క్వారంటైన్‌ నుంచి తప్పించుకుందామని ఆంగుల్‌ జిల్లాలోని ఓ వంతెన వద్దకు రైలు రాగానే రైలు నుంచి దూకేశారు. 

ఈ విషయం గమనించిన బెనగాడియా గ్రామ సర్పంచ్‌ బిరాబరా నాయక్‌ వారిలో నుంచి ఏడుగురిని పట్టుకొని అధికారులకు అప్పగించగా..జగత్‌సింగ్‌పూర్‌లో ఏర్పాటుచేసిన క్వారంటైన్‌కు తరలించారు. కాగా..ఇప్పటివరకు పలు ప్రాంతాల నుంచి ఒడిశాకు వచ్చిన 391 మంది వలస కూలీల్లో 300 మందికి పాజిటివ్‌గా తేలింది.వారిని  క్వారంటైన్‌ నిబంధనలు కఠినతరం చేశారు. ఇది వారి రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం క్వారంటైన్ ను కఠినతరం చేశామని అధికారులు చెబుతున్నారు. 

Read Here >> శ్రామిక్ రైళ్ల సంఖ్య పెంపు… డెస్టినేషన్ స్టేట్ లో 3స్టాప్ లు